Moviesఉన్న హీరోలే పిసుకుంటుంటే..నువ్వు ఏం పీకుదామని వచ్చావ్..!?

ఉన్న హీరోలే పిసుకుంటుంటే..నువ్వు ఏం పీకుదామని వచ్చావ్..!?

సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. తాతల పేరు చెప్పుకుని కొందరు.. నాన్న పేరు చెప్పుకొని మరికొందరు.. అమ్మ, పిన్నమ్మ పేర్లు చెప్పుకొని మరికొందరు..ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సినీ ఇండస్ట్రీ పై పడి బ్రతికేస్తున్నారు. వీళ్లల్లో కొందరికి నిజంగా హీరో అయ్యే లక్షణాలు లేవు అది అందరికీ తెలిసిందే. ఈవెన్ స్టార్ హీరో కొడుకులకు కూడా ఆ కెపాసిటీ లేదు. ఏదో తండ్రి పేరు చెప్పుకొని ఆ టాక్ ను కంటిన్యూ చేస్తున్నారే తప్పిస్తే.. ముఖ్యంగా హీరో అయ్యే లక్షణాలు చాలామందికి లేవు.

అయితే సినీ ఇండస్ట్రీ చాలా విశాలమైనది ఉన్న హీరోలు చాలదన్నట్లు.. కొత్త హీరోలకు కూడా అవకాశం ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉన్న హీరోలే.. కొత్త కథలు దొరకక తీసిన కథలను మళ్ళీ తీస్తూ అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకుంటూ..తమ పరువు పోగొట్టుకుంటున్నారు. పచ్చిగా చెప్పాలంటే ఉన్న హీరోలే ఏం చేయాలో తెలియక ఏదో పిసుకుంటూ ఇంకేదో చేసేద్దామని ఏదేదో చేసేస్తున్నారు. మరి ఇలాంటి టైం ఒక కొరియోగ్రాఫర్ హీరోగా ఎంట్రీ ఇస్తే జనాలు నవ్వుకోరు ప్రజెంట్ అదే జరుగుతుంది.

సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అంటే ఓ రకమైన గౌరవం ఉంది. కష్టపడి పైకి వచ్చి సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎదిగి.. కొత్త కొత్త స్టెప్స్ తో కుర్రాలను ఆకట్టుకుంటున్నాడు జానీ మాస్టర్. ఈయన కొరియోగ్రఫీకి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ఈమధ్య నే బీస్ట్ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.అయితే శుభ్రంగా వచ్చిన పని చేసుకోక హీరోగా ఎంట్రీ ఇచ్చి జానీ మాస్టర్ తప్పు చేశారు అంటున్నారు కొందరు అభిమానులు.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా “యధా రాజా తథా ప్రజా” అనే సినిమా రాబోతుంది. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హీరో శర్వానంద్ క్లాప్ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, శుభ్రంగా వచ్చిన పని చేసుకోకుండా ఇలా హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై జానీ మాస్టర్ ను కొందరు ట్రోల్ చేస్తున్నారు . “ఉన్న హీరోల్లో ఏం పిసుకుకోలేకపోతుంటే నువ్వేం పీకుతామని ఇండస్ట్రీకి వచ్చారు సార్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news