Moviesవారెవ్వా: వాట్ ఏ కాంబినేషన్..మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్...

వారెవ్వా: వాట్ ఏ కాంబినేషన్..మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరో..?

సినీ తెర పై కొన్ని కాంబినేషన్స్ భళే సెట్ అవుతాయి. ఇక ఆ కాంబో మళ్లీ రిపీట్ అయితే..బొమ్మ అద్దిరిపోవాల్సిందే. అలాంటి క్రేజీ కాంబినేషన్ నే మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ లది. వీళ్లిద్దరు కలి ఇప్పటివరకు రెండు సినిమాలో వర్క చేసారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు అభిమానులు. అయితే ఏట్టకేలకు వాళ్ల ఆశలు నిజం చేస్తూ..ఇద్దరు కలిసి వర్క్ చేసేందుకు కమిట్ అయ్యారు. ఇక దీని పై అఫిషియల్ గా కూడా ప్రకటించారు,

దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమారాబోతుంది. మాములుగా త్రివిక్రమ్ సినిమాలంటే కుటుంబ కథాంశంతో ఉంటాయి. ఇక ఇప్పుడు మహేష్ తో తెరకెక్కించే స్తోరీ కూడా దాదాపు అలాంటి సినిమానే అంటున్నారు. ఈ సినిమాకోసం భారీ సెట్టింగ్ లను కూడా వేయనున్నారట. అలాగే ఈ సినిమా మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉండట. ఆ రోల్ కోసం మలయాళ ముద్దుగుమ్మ సమ్యుక్త మీనన్ ను ఏంపిక చేసిన్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమా నుండి అద్దిరిపోయే వార్త ఒకతి బయటకు వచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన మహేష్ బాబు కి సరిసమానంగా ఉండే పాత్రలో కనిపించనున్నారట. కానీ తండ్రి పాత్ర కాదని తెలుస్తుంది.

ఈ సినిమా మొత్తానికి మోహన్ లాల్ పాత్ర చాలా కీలకం అన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండడం మరో విశేషం. కాగా ప్రస్తుతం మహేష్ బాబు.. పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయ్యాక దర్శక ధీరుడు రాజమౌళి తో కూడా మహేష్ వర్క్ చేయనున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news