Moviesతార‌క్ కోసం సీరియ‌స్‌గా ట్రైల్స్ వేస్తోన్న ద‌ర్శ‌కుడు...!

తార‌క్ కోసం సీరియ‌స్‌గా ట్రైల్స్ వేస్తోన్న ద‌ర్శ‌కుడు…!

టాలీవుడ్ క్రేజీ హీరో తార‌క్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస‌రికే మ‌రో యేడాది ప‌ట్టేలా ఉంది.  ఆ వెంట‌నే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ సినిమాకు ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు. త్రివిక్ర‌మ్ సినిమా ఫినిష్ అయ్యాక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే తెర‌కెక్కుతున్నాయి.

ఇవ‌న్నీ ఇలా ఉంటే ఓ ద‌ర్శ‌కుడు మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. వాస్త‌వానికి జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత స‌ద‌రు ద‌ర్శ‌కుడితోనే తార‌క్‌ సినిమా చేయాల‌నుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే స‌ద‌రు ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ ఎన్టీఆర్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. ఇంత‌కు స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు స్టార్ స్టోరీ రైట‌ర్ వ‌క్కంతం వంశీ.

ఈ స్టార్ రైట‌ర్ గ‌తంలో ఎన్నో హిట్ సినిమాల‌కు క‌థ అందించాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్యతో దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి వంశీ తార‌క్‌తో సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఓ మంచి క‌థ రెడీ చేసుకుని తార‌క్‌ను సినిమాకు ఒప్పించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని అంటున్నారు. మ‌రి మ‌రో మూడేళ్ల వ‌ర‌కు తార‌క్ ఖాళీ అయ్యే ఛాన్సులు లేవు. ఈ లెక్క‌న వంశీ కోరిక ఎప్ప‌ట‌కి నెర‌వేరుతుందో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news