Gossipsట్రిపుల్ ఆర్ వాళ్లిద్దరే లక్కీ గాళ్స్.. రాజమౌళి సీక్రెట్ కు కారణం...

ట్రిపుల్ ఆర్ వాళ్లిద్దరే లక్కీ గాళ్స్.. రాజమౌళి సీక్రెట్ కు కారణం అదే..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ రెండో షెడ్యూల్ సెట్స్ మీదకు వెళ్లింది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ లో కూడా ఇద్దరు హీరోలకు సంబందించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారటట.

అయితే రాజమౌళి ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసి ఉంచాడని వారిని సీక్రెట్ గా ఉంచుతున్నాడని తెలుస్తుంది. హీరోయిన్స్ సెట్స్ మీదకు వెళ్లినప్పుడు మాత్రమే వీళ్లా అని ఆశ్చర్యపోయేలా రాజమౌళి ప్లాన్ చేశాడట. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్, కియరా అద్వానిలకు ఆర్.ఆర్.ఆర్ లో ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఆ ఇద్దరు భామలు ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. రాజమౌళి సినిమాల్లో హీరోయిన్ అంటే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నట్టే.

అదిగాక ఇద్దరు సూపర్ స్టార్ నటిస్తున్న మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాపై ఇంకాస్త క్రేజ్ ఏర్పడింది. ఒకవేళ ఈ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే కనుక ఏ హీరోయిన్ అయినా దశ తిరిగినట్టే. ఇక మరోమాట ఏంటంటే ఈ సినిమాలో మూడవ హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ పాత్రకు సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తుందని తెలుస్తుంది. మరి రాజమౌళి అఫిషియల్ గా చెప్పేదాకా ఆర్.ఆర్.ఆర్ గురించి ఇలాంటి వార్తలు ఎన్నైనా వస్తాయి. వాటిల్లో ఏది వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news