Specialsఐటీ ఎగవేతపై...మీడియా ముందుకు ఎన్టీఆర్...దటీజ్ యంగ్ టైగర్...

ఐటీ ఎగవేతపై…మీడియా ముందుకు ఎన్టీఆర్…దటీజ్ యంగ్ టైగర్…

‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించి పన్ను ఎగవేత వ్యవహారంలో కాగ్ అభ్యంతరం నేపథ్యంలో ఐటీ శాఖ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయన్న వార్తలపై ఈ హీరో స్పందించాడు. తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని తారక్ స్పష్టం చేశాడు. తను పన్ను ఎగవేయలేదని, తనకు మినహాయింపు
వర్తిస్తుందని తారక్ చెప్పుకొచ్చాడు.

‘నాన్నకు ప్రేమతో’ సినిమా పూర్తిగా విదేశంలో షూటింగ్ జరుపుకుందని, ఆ సినిమా కార్యకలాపాలన్నీ దేశం బయట జరిగినందున.. అందుకు గానూ తను పొందిన పారితోషకానికి దేశంలో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనేది ఈ హీరో వాదన. ఈ అంశం ఆధారంగానే ఎన్టీఆర్ తో సహా మరికొందరు హీరోలు పన్ను ఎగవేశారని కాగ్ ఆక్షేపించినట్టుగా వార్తలు వచ్చాయి.

విదేశాల్లో చిత్రీకరించిన సినిమాలకు హీరోలు పన్నులు కట్టడం లేదని కాగ్ కనుగొంది. ఈ అంశాన్ని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తారక్ స్పందిస్తూ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’సినిమాకు పొందిన పన్ను మినహాయింపుకు ఇది వరకే వివరణ ఇచ్చామని, ఆ సినిమా పారితోషకానికి గానూ తను కోటీ పది లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని.. తన చార్టెడ్ అకౌంట్ల ద్వారా ఐటీ శాఖకు వివరణ ఇచ్చామని.. తను ఎలాంటి తప్పూ చేయలేదని ఈ సినీహీరో అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news