Moviesఒక్కే ఒక్క నిర్ణయంతో టాలీవుడ్ చరిత్రను తిరగరాయబోతున్న పూరి జగన్నాథ్ .....

ఒక్కే ఒక్క నిర్ణయంతో టాలీవుడ్ చరిత్రను తిరగరాయబోతున్న పూరి జగన్నాథ్ .. ఇక డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పులు మొదలైనట్లే..!

పూరి జగన్నాథ్ ..తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ తో తెలుగు డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు జనాలు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎంత మంది హీరోలను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించాడో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో బద్రి – రవితేజతో ఇడియట్ లాంటి సినిమాలను తెరకెక్కించి సినిమా ఇండస్ట్రీకి కొత్త రకమైన ఫీలింగ్ ను క్రియేట్ చేశారు .

ఈ సినిమాలు ఇప్పటికీ మనం టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నామంటే కారణం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ అని చెప్పుకోక తప్పదు . అయితే ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ తన ఫ్యాన్స్ ఇష్టం లేని సినిమాలు తెరకెక్కించి.. తన క్రేజ్ ని డమాల్ అంటూ పడిపోయేలా చేసుకున్నాడు. పూరీ జగన్నాథ్ క్రేజ్ ఇప్పుడు అస్సలు లేదు. ఆయనతో సినిమా అంటే మేకర్స్ భయపడిపోతున్నారు . హీరోలు అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడం దానికి ఇంకా ఆజ్యం పోసినట్లయింది . కాగా రీసెంట్ గా పూరి జగన్నాథ్ ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా డైరెక్షన్ కి గుడ్ బై చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట . అంతేకాదు ఆయన తన లాస్ట్ సినిమాగా డబల్ ఇస్మార్ట్ నే ప్రకటించబోతున్నారట. దీంతో తెలుగు డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పులు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన డైరెక్టర్ ఇలా హిట్లు లేక భయపడిపోయి డైరెక్షన్ ని వదిలేస్తున్నారు అంటే.. ఫ్యూచర్లో మిగతా డైరెక్టర్ల పరిస్థితి ఏంటి ..?? అంటూ టెన్షన్ పడుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news