News"జూబ్లీహిల్స్ లో దేశ ద్రోహులు ఉన్నారు"..తేజ కామెంట్స్ ఆ స్టార్ హీరో-కొడుకులకేనా..?

“జూబ్లీహిల్స్ లో దేశ ద్రోహులు ఉన్నారు”..తేజ కామెంట్స్ ఆ స్టార్ హీరో-కొడుకులకేనా..?

నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది , ఇదివరకటితో పోలిస్తే చాలా తక్కువ ఘర్షణలతో సక్సెస్ఫుల్గా పోలింగ్ ని కంప్లీట్ చేశారు అధికారులు . అయితే ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా చాలా తక్కువ పోలింగ్ నమోదవడం అధికారులకు సైతం షాక్ ఇచ్చింది . చాలామంది జనాలు ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొందరు వర్షం కారణంగా ఆగిపోతే మరికొందరు పలు పర్సనల్స్ కారణాలు కారణంగా ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు.

అయితే అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులకు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సరే తెలంగాణలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు అవ్వడం అభిమానులకు మింగుడు పడడం లేదు. అయితే ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ తేజ ఓటు వేయని వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓటు హక్కు వినియోగించుకుని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ..”మామూలుగా అందరూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు ..మాకు అది రావడం లేదు.. నీళ్లు రావడం లేదు.. రోడ్లు బాగాలేవు అంటూ కంప్లైంట్ ఇచ్చే వారందరూ ముందు బయటకు వచ్చి ఓటు వేయండి . సమాజంలో మీ హక్కులను మీరు తెలుసుకోండి . చాలామంది ఆరోగ్యం బాగున్న ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . కొంతమంది ఆరోగ్యం బాగో లేకపోయినా వీల్ చైర్ లో వచ్చి ఓటు వేస్తున్నారు “.

“మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో తక్కువ ఓటింగ్ నమోదు అవుతూ ఉంటుంది .. జూబ్లీహిల్స్ లో ఉండే వాళ్ళు ఓట్లు వేయడానికి ఇష్టపడరు అంటే ఇక్కడ ఎక్కువ దేశద్రోహులు ఉన్నట్లు అర్థం . ఎవరైతే ఇంట్లో కూర్చొని ఓట్లు వేయకుండా టీవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరూ దేశద్రోహులే అని నా ఫీలింగ్ అంటూ చాలా బోల్డ్ గా చెప్పుకొచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ లో ఉండే బడా స్టార్ ప్రముఖుల పై తేజ పరోక్షంగా కామెంట్ చేశాడు అంటున్నారు జనాలు . జూబ్లీహిల్స్ లో ఆల్మోస్ట్ ఆల్ బడా బడా సెలెబ్రెటీసే ఉంటారు . సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రముఖ వ్యాపారవేత్తలు మరి అలాంటి వాళ్లపైనే ఇంత బోల్డ్ గా కామెంట్ చేశారు అంటే దీని వెనక ఏదో అర్థం ఉండనే ఉంటుంది అంటూ ఆరాతీస్తున్నారు. కొందరు తేజ కామెంట్స్ ఆ తెలుగు హీరో-కొడుకులకే..వాళ్ళు ఓటు వేయలేదు అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news