News"దయ చేసి యానిమల్ సినిమా చూడొద్దు".. రష్మిక సంచలన ప్రకటన వైరల్..ఏమైందంటే..?

“దయ చేసి యానిమల్ సినిమా చూడొద్దు”.. రష్మిక సంచలన ప్రకటన వైరల్..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది రష్మిక మందన్నా తాను నటించిన యానిమల్ సినిమాను చూడొద్దు అంటూ తన పేరెంట్స్ కు చెప్పుకొచ్చిందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రష్మిక తాజాగా నటించిన సినిమా యానిమల్ . డిసెంబర్ ఒకటిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది . అంతేకాదు గ్రాండ్ సక్సెస్ కూడా అయింది . సినిమాలో అమ్మడు కాస్త బోల్డ్ గా కనిపించిందని ..

కానీ కథా కంటెంట్ అయితే జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది . మరీ ముఖ్యంగా యువతకు యంగ్ జనరేషన్ కు ఈ సినిమా పిచ్చెక్కించేసింది. కొందరు పదేపదే ఈ సినిమాను థియేటర్స్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే యువతని ఏ రేంజ్ లో పిచ్చి ఎక్కించేశాడు సందీప్ రెడ్డి వంగ అర్థం చేసుకోవచ్చు . అయితే రష్మిక మందన్నా ఈ సినిమాలో బోల్డ్ గా నటించడంతో ముందుగానే ఆమె తన తల్లిదండ్రులకు సిస్టర్ కు ఈ సినిమా దయచేసి చూడొద్దు అంటూ చెప్పుకొచ్చేసిందిట .

“ఈ సినిమాలో నేను కొంచెం బోలెడుగా నటించాను. కచ్చితంగా అది చూసి మీరు తట్టుకోలేరు .. దయచేసి ఈ సినిమాని మీరు చూడొద్దు” అంటూ తన తల్లిదండ్రులకు ముందుగానే చెప్పిందట . సినిమా ఇండస్ట్రీలో ఇవంతా చాలా కామన్ అంటూ కూడా చెప్పుకొచ్చిందట. ఇదే న్యూస్ తెలుసుకున్న అభిమానులు తిట్టిపోస్తున్నారు. అలాంటి సీన్స్ చేయడమే తప్పు.. చేసి తల్లిదండ్రుల ముందు ఇలా మాట్లాడడం ఇంకా తప్పు అంటూ ఏకిపారేస్తున్నారు . యానిమల్ సినిమా వాల్ల రష్మిక కు ఉపయోగపడింది ఏమీ లేదు ..అంటూ బూతులు తిడుతున్నారు. దీనివల్ల బాగుపడింది అంటూ ఉంటే రన్బీర్ కపూర్ ఒక్కడే అని ఆయన నటన మాత్రం ఈ సినిమాలో టూ గుడ్ అంటూ పొగిడేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news