Newsబాల‌య్య‌ను ఫాలో అవుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌... షేకింగ్ న్యూస్ ఇది..!

బాల‌య్య‌ను ఫాలో అవుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌… షేకింగ్ న్యూస్ ఇది..!

బుల్లితెరపై బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో చూస్తూనే ఉన్నాం. ఇంకా బాలయ్యను ఈ షో ఈ తరం జనరేషన్‌కు బాగా కనెక్ట్ చేసింది. యూత్‌లో బాలయ్యకు ఈ షో తో తిరుగులేని క్రేజ్ వచ్చింది. చాలామంది సెలబ్రిటీలు పాపులర్ అయ్యేందుకు తమ సినిమాల ప్రచారం కోసం కూడా బాలయ్య టాక్ షోను వాడుకున్నారు. ఈ షో తో ఆహా ఓటీటీ ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.

అంతకుముందు తెలుగు బుల్లితెరపై ఎన్ని టాక్‌షోలు వచ్చినా కూడా బాలయ్య అనుస్టాపబుల్ ఆ టాక్ షోలను మైమరిపిస్తూ సరికొత్త సంచలన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఈ షో తర్వాత బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే అప్పుడు బాలయ్య టాక్‌షో చేసినప్పుడు కొన్ని పొలిటికల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఇప్పుడు బాలయ్య స్టైల్‌లోనే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మరో స్టార్ హీరో రానా దగ్గుపాటి కలిసి ఓ క్రేజీ షో చేస్తున్నట్టు తెలుస్తోంది.

వీరిద్దరి క్రేజ్‌ని పలువురు తమ ప్రమోషన్ల కోసం ఇప్పటికే వాడుకుంటున్నారు. రానా, విజయ్ ఇద్దరు పలు టీవీ ప్రకటనల్లో టీవీ ఇంటర్వ్యూలలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ ప్రోగ్రాం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హడావుడి నడుస్తోంది.
ఈ ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఆయా పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట.

ఈ ప్రోగ్రాంని టాలీవుడ్ క్రేజీ హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ కలిసి హోస్ట్ చేస్తునట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి కేటీఆర్ ను రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశారట. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తయిందంటూ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ ని కొన్ని రోజుల్లో వరుసపెట్టి అన్ని టీవీ ఛానల్స్ లో ప్రచారం చేయబోతున్నారు. మరి ఇంటర్వ్యూ తర్వాత విజయ్ దేవరకొండ, రానా అ ఈషో ఏ రేంజ్‌లో పాపులర్ అవుతుందో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news