Newsఆ టాలీవుడ్ హీరో న‌న్ను ట్రై చేశాడు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతోన్న...

ఆ టాలీవుడ్ హీరో న‌న్ను ట్రై చేశాడు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతోన్న అన‌సూయ కామెంట్స్‌

యాంకర్ అనసూయ జబర్దస్త్ షోతో తన సినిమా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెరపై సూపర్ పాపులర్ అయ్యాక.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. వెండితెరపై అనసూయ విన్నర్ లాంటి సినిమాలో ఏకంగా ఐటెం సాంగ్ లో కూడా హీరోతో పోటీపడి డ్యాన్స్‌ చేసింది. క్షణం లాంటి సినిమాతో వెండితెరపై కూడా సత్తా చాట్టి ఆమెలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసింది. ఇక రంగస్థలం సినిమాలతో అనసూయ మారిపోయింది.

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ఎంత పాపులర్ అయిందో చూశాం. ప్రస్తుతం ఆమెకు వరుసగా సినిమాల్లో ఛాన్సులు రావడంతో క్షణం తీరికలేకుండా ఫుల్ బిజీగా కెరీర్ గడుపుతుంది. ఇటీవల అనసూయ విమానం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఒక్కసారి హాట్ హాట్ గా కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనను ట్రోల్ చేసే వారికి ఆమె గట్టిగా కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. తనను ఆంటీ అనే వారిపై అనసూయ ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో చూస్తూనే ఉన్నాం.

తాజాగా అనసూయ ఇంటర్వ్యూలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తను అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు కూడా చేశాను. ఎంబీఏ చదివి హెచ్ఆర్ గా పనిచేశాను. క్షణం సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చిందని చెప్పింది. 2013లో ఒకసారి అడవి శేష్ కలిశాడని.. ఆ టైంలో అతడిని చూసి తాను మరోలా ఆలోచించానని అనసూయ చెప్పింది. హీరోలంతా త‌న‌ను లైన్ వేయటానికి అప్రోచ్ అవుతారని అనిపించింట‌.

అందుకే అప్పుడు అడివి శేష్‌ని బాగా అవాయిడ్ చేశా. మూడు నెలల తర్వాత ఒక కాఫీ షాప్ లో మళ్ళీ అనుకోకుండా కలిశామని.. అక్కడ కూర్చోబెట్టి మీరు దొరకట్లేదు అని సినిమా స్టోరీ చెప్పాడని.. అప్పుడు వాళ్ళ సినిమాకు నా అవసరం ఉందన్న విషయం అర్థమయ్యే తాను క్షణం సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు అనసూయ తెలిపింది. జబర్దస్త్ లో తాను సీరియస్‌గా కనిపించడం చూశారట. అందుకే ఆ పాత్రకు తానే సెట్ అవుతానని అలా చేశారు అని అనసూయ చెప్పింది. ఏది ఏమైనా అడవి శేష్‌ను అనసూయ ముందుగా ఎంతలా అపార్థం చేసుకుందో అమె మాటలు చెబుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news