Newsప్రియమణికి సవతిపోరు తప్పలేదా... భ‌ర్త మొద‌టి భార్య‌తో ఇంత టార్చ‌రా...!

ప్రియమణికి సవతిపోరు తప్పలేదా… భ‌ర్త మొద‌టి భార్య‌తో ఇంత టార్చ‌రా…!

ప్రియమణికి సవతిపోరు తప్పడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రియమణి పెళ్లి చేసుకున్న ముస్తఫా రాజ్ కి అంతకముందే పెళ్ళైంది. ఇక్కడే ఓ తిరకాసు ఉందట. ఎవరే అతగాడు ప్రియమణికి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చాలా ఏళ్ళకి మళ్ళీ పెళ్ళైన కొత్తలో అనే సినిమా చేసి టాలీవుడ్ లో హిట్ అందుకుంది.

తమిళంలో నటించిన పరుత్తి వీరన్‌తో నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత నుంచి ప్రియమణి అటు తమిళంలో ఇటు తెలుగులో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రెండు భాషలలో మంచి హిట్స్ ఉన్నాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయడానికి వెనకాడదు. ఎంతటి డీగ్లామర్ రోల్ అయినా ఆసక్తిగా చెయడానికి ఒప్పుకుంటుంది.

పరుత్తి వీరన్, నారప్ప, విరాట పర్వం సినిమాలే ఇందుకు ఉదాహరణ. సినిమా ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ ఉన్న ప్రియమణి రియల్ లైఫ్ లో మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటుందట. మైక్రో మాక్స్ సీఈవో అయిన ముస్తఫా రాజ్ ని ఈమె పెళ్లి చేసుకుంది. కానీ, అప్పటికే ఇంకో ఆవిడతో ముస్తఫాకి పెళ్లి జరిగింది. ఆమెకి డివోర్స్ ఇవ్వకుండానే ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడట.

దాంతో మొదటి భార్య నుంచి ప్రియమణికి ఒత్తిడి వస్తుందని లోలోపల టాక్ వినిపిస్తోంది. అ మధ్య వీరిద్దరి మీద ముస్తఫా రాజ్ మొదటి భార్య కేసు కూడా పెట్టిందట. ఓ సందర్భంలో ఈ విషయం ప్రియమణిని అడిగితే అలాంటిదేమీ లేదు. అంతా సెటిలైంది. అన్నీ క్లియర్ అయ్యాకే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది. కానీ, వ్యవహారం మాత్రం అలాగే ఉందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news