Newsప్ర‌భాస్ సినిమా కోసం తెచ్చిన 200 మూర‌ల మ‌ల్లెపూలు మాయం... చాలా...

ప్ర‌భాస్ సినిమా కోసం తెచ్చిన 200 మూర‌ల మ‌ల్లెపూలు మాయం… చాలా క‌థ‌ జ‌రిగిందే…!

టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు బి గోపాల్. లారీ డ్రైవర్, సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర లాంటి సినిమాలు బి గోపాల్ టాలెంట్ ని ప్రత్యేకంగా చెప్తాయి. ఆయన మేకింగ్ కి పరుచూరి బ్రద‌ర్స్‌ కలం బలం తోడై ఇలాంటి బ్లాక్ బస్టర్ వచ్చాయి. సీనియర్ హీరోలతో మాత్రమే కాదు, ఎన్.టి.ఆర్, ప్రభాస్, రామ్‌ లాంటి కుర్ర హీరోలతోనూ ఆయన సినిమాలు తీశారు.

ఎన్.టి.ఆర్ తో నరసింహుడు, ప్రభాస్ తో అడవి రాముడు, రామ్‌తో మస్కా లాంటి సినిమాలు తీశారు. అయితే, అడవి రాముడు..నరసింహుడు డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాల పరాజయంతో నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఒక్క మస్కా మాత్రం అలా అలా ఆడి నిర్మాతని ముంచలేదు. అయితే పైన ఫ్లాప్ సినిమాలైన వాటికి బాధ్యత బి గోపాల్ అని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు.

కథ పూర్తిగా రెడీ అవకుండానే షూటింగ్ మొదలుపెట్టడం మధ్యలో ఆపేయడం..దానివల్ల నిర్మాతకి కోట్ల నష్టం వచ్చిందని టాలీవుడ్ లో టాక్ ఉంది. వాస్తవంగా ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన అడవి రాముడు సినిమాకి అనవసరంగా బి గోపాల్ బడ్జెట్ పెట్టించి నిర్మాతను ముంచాడట. దీనికి ఓ చిన్న ఉదాహరణ కూడా ఇండస్ట్రీలో చెప్పుకున్నారు.

అడవి రాముడు సినిమా సాంగ్ షూటింగ్ సమయంలో బి గోపాల్ తన అసిస్టెంట్ కి చెప్పి 200 మూరల మల్లెపూల మాలలు తెమ్మన్నాడట. అసిస్టెంట్ వెళ్ళి నిర్మాతకి విషయం చెప్పగానే 200 మూరల మల్లెపూల మాలలా ఏం చేసుకుంటారయ్యా అని షాకయ్యాడట. చేసేదేమీ లేక అడిగినట్టుగా 200 మూరల మల్లెపూలు తెప్పించి ఇచ్చాడట. మరి అవి దేనికి వాడాడో ఆయనకే తెలియాలి. అప్ప‌ట్లో ఇది ఆ సినిమా యూనిట్ టైంలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news