Newsసురేష్ బాబుకి పవన్ కళ్యాణ్ అలా బుద్ధి చెప్పాడా..?

సురేష్ బాబుకి పవన్ కళ్యాణ్ అలా బుద్ధి చెప్పాడా..?

పవన్ కళ్యాణ్ అంటే నిర్మాతలు ఒక విషయంలో ఒణికిపోతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఒక్కోసారి సెట్ కి ఎవరూ రాకముందే వచ్చేసి కుర్చీలో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటూ కూర్చుంటారట. ఒక్కోసారి సెట్ లో 150 మంది ఉన్నా..మూడ్ బాగాలోకేపోతే కారెక్కి వెళ్ళిపోతారట. ఆరోజు షూటింగ్ కోసం పెట్టిన డబ్బు మొత్తం బూడిదలో పోసినట్టే.

ఇలాంటి కాంప్లికేటెడ్ మెంటాలిటీ అని చెప్పుకుంటుంటారు. పవన్ కళ్యాణ్ మూడ్ సరిగ్గా ఉండాలే గానీ, రెండు రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన సీన్స్ కూడా ఒకటిన్నర రోజులో లేపేస్తారట. అందుకే, నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినిమా కమిటయ్యే ముందు అన్నిటికీ సిద్ధపడి ప్రాజెక్ట్ మొదలుపెడతారు. ఇప్పుడు ఆయన రాజకీయాలలోనూ బిజీగా ఉన్నారు కాబట్టి అసలు సంతకం పెట్టిన సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి,

ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్టులను కూడా చాలా బాగా చూసుకుంటారట. ప్రొడక్షన్ విషయంలో నిర్మాతకి అన్నీ సరిగ్గా చూసుకోమని మొహమాటం లేకుండా చెప్తారట. ఈ విషయంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబుకే ఓ సందర్భంలో చుక్కలు చూపించారట. వెంకటేశ్, పవన్ కళ్యాణ్ కలిసి బాలీవుడ్ హిట్ సినిమా ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల సినిమాలో నటించారు.

ఈ సినిమా సాంగ్ షూట్ కోసం వందలమంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకున్నారు. అయితే, వరుసగా నాలుగైదు రోజులు ఉదయం 6 నుంచి నైట్ 9వరకూ పని చేయించుకొని పేమెంట్ మాత్రం ఒకరోజుకే ఇచ్చారట. దాంతో ఒకరోజు అందరూ వెళ్ళి విషయం పవన్ కళ్యాణ్ కి చెప్పారట. అప్పుడు కళ్యాణ్ కావాలనే సరిగ్గా సాయంత్రం 5.30 కి వెళ్ళి తన కేరవ్యాన్ లో కూర్చొని 7.30 – 8.00 గంటల లోపు వెళ్ళేవారట. అంటే పవన్ కళ్యాణ్ కి ఇంకో రోజు ఎక్స్‌ట్రా పేమెంట్ సురేశ్ బాబు ఇవ్వాల్సి ఉంది. జూనియర్ ఆర్టిస్టులతో ఎక్కువ పనిచేయించుకొని తక్కువ డబ్బులు ఇచ్చినందుకు పవన్ ఇలా వాత పెట్టారని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news