Moviesవియ్యంకులు అవుతోన్న ముర‌ళీమోహ‌న్ - రాజ‌మౌళి, కీర‌వాణి...!

వియ్యంకులు అవుతోన్న ముర‌ళీమోహ‌న్ – రాజ‌మౌళి, కీర‌వాణి…!

టాలీవుడ్ లో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకుంటున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. ఆ రెండు కూడా చాలా పెద్ద కుటుంబాలు.. తెలుగు సినిమా ప్రతిష్టను ఆస్కార్ లెవెల్ కు తీసుకు వెళ్లిన కుటుంబం ఒకటి కాగా.. నాలుగైదు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో ఎంతో అనుబంధం ఉండి.. రియల్ ఎస్టేట్, రాజకీయాలు.. సినిమాలలో ఆరితేరిన కుటుంబం మరొకటి.

ఈ రెండు కుటుంబాలకు అటు తెలుగు ప్రేక్షకులు అందరితో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కీరవాణి తన సోదరుడు రాజమౌళి కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ? చెప్పక్కర్లేదు.

వీరిద్దరి కాంబినేషన్ ఏకంగా తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ లెవెల్ కు తీసుకువెళ్ళింది. కీరవాణి రెండో కుమారుడు సింహ ఇప్పటికే సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వైవిధ్యమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సింహకు అటు మాగంటి మురళీమోహన్ మనవరాలితో పెళ్లి కుదిరినట్టు తెలుస్తోంది.

సీనియ‌ర్ న‌టుడు మురళీమోహన్ కు ఒక్క‌గానొక్క‌ కొడుకు. ఆ కొడుకుకు ఒకరే కుమార్తె. ఈ పాప అటు తెలుగుదేశం మహిళ నేత అయిన రూపా మాగంటి కుమార్తె. ఆమె వేల కోట్ల ఆస్తికి వారసురాలు.. మురళీమోహన్ మనవరాలు చాలా అందంగా ఉంటారని.. ఆమెకు కీరవాణి కుమారుడు సింహ అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఇరువురు కుటుంబాలు ఈ పెళ్ళికి ఇప్పటికే ఒకే చెప్పాయని.. వచ్చే ఏడాది విరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news