Moviesమహేశ్-సాయి పల్లవి కాంబోలో మిస్సైన ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో...

మహేశ్-సాయి పల్లవి కాంబోలో మిస్సైన ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా…సెట్ అయ్యుంటే రచ్చ రంబోలానే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఫ్యాన్స్ మాత్రం అలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వడానికి తెగ ఆతృత పడుతూ ఉంటారు .. ఆశ పడుతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ కాంబోనే మహేష్ బాబు – సాయి పల్లవి . ఇద్దరికీ ఇద్దరి చూడడానికి చాలా చక్కగా అందంగా .. ముట్టుకుంటే కందిపోయే అంత సున్నితంగా ఉంటారు .

అయితే నటన విషయంలో మహేష్ బాబు ఎంత గుడ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డ్యాన్స్ విషయంలో సాయి పల్లవిని కొట్టేవాళ్ళు లేరని చెప్పాలి . అంతటి స్మార్ట్ .. ఎంతటి మాస్ స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తుంది. అయితే వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సింది . కానీ లాస్ట్ మూమెంట్లో మిస్సయింది . ఆ సినిమా మరేదో కాదు ఫిదా . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతోనే.

నిజానికి ఈ సినిమాలో వరుణ్ తేజ్ కన్నా ముందు శేఖర్ కమ్ముల మహేష్ బాబును అనుకున్నారట. కానీ అప్పటికే వేరే సినిమా షూట్స్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు కథ నచ్చినా.. ఈ సినిమాను వదులుకోక తప్పలేదు. అంతేకాదు సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టాక చాలా చాలా బాధపడ్డారట మహేష్ బాబు . చూడాలి మరి తెర పై ఎప్పుడు వీళ్ల కాంబో సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news