Movies"చాలా కష్టమే.. కానీ దీనికి ముగింపు పలకాలి".. సమంత సంచలన పోస్ట్...

“చాలా కష్టమే.. కానీ దీనికి ముగింపు పలకాలి”.. సమంత సంచలన పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే . అయితే విదేశాలలో ఈ వ్యాధికి చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత శాకుంతలం-ఖుషి-సిటాడిల్ వెబ్ సిరీస్ లో పాల్గొన్నట్లు ప్రచారం జరిగింది . అయితే తాజాగా సమంత కొన్నాళ్లపాటు సినిమాకి బ్రేక్ వేయబోతుంది అని పిఆర్ టీఅం స్వయంగా చెప్పుకోరావడంతో సమంతకి మళ్ళీ మయోసైటీస్ వ్యాధి తిరగబడింది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు .

అంతేకాదు ఈ కారణంగానే సమంత షూటింగ్ కి కొన్ని నెలలు బ్రేక్ వేసింది అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి . అయితే తాజాగా సమంత పెట్టిన పోస్ట్ చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తుంది. సమంత సోషల్ మీడియా వేదికగా అ పోస్ట్ పెట్టుకు వచ్చింది. తన ఫోటోని షేర్ చేస్తూ.. చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ ఆరు నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి” అని పోస్ట్ చేసింది.

దీంతో ఎంత కష్టమైనా సరే ఈసారి మాత్రం మయోసైటిస్ కి ముగింపు పలకాలని సమంత ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. దీనితో సమంత మయోసైటీస్ కి ట్రీట్ మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళుతుందని .. ఆ కారణంగానే సినిమాలకు బ్రేక్ వేస్తుందని కన్ఫర్మ్ అయిపోయారు అభిమానులు. అంతేకాదు సమంతకి మళ్ళీ మయోసైటీస్ వ్యాధి తిరగబడిందా ..? తన ప్రాణానికి ప్రమాదం ఉందా ..? అంటూ భయపడిపోతున్నారు . కాగా సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ప్రజెంట్ దూరం దూరంగా బ్రతుకుతున్నారు ఈ జంట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news