Newsరష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ బ్రేకప్ నిజమే.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా..?

రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ బ్రేకప్ నిజమే.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాల మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంత అన్యోన్యంగా ఉన్న జంట సడన్గా విడిపోయారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే దానికి తగ్గట్టే రష్మిక మందన విజయ్ దేవరకొండ కూడా నడుచుకుంటూ ఉండడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ మధ్యకాలంలో రష్మిక మందన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎక్కువగా తిరుగుతూ ఉండడం.. అదే టైంలో రష్మిక మందన – విజయ్ దేవరకొండకు దూరంగా ఉండడం .. ఈ వార్తలకు ఆజ్యం పోసేలా ఉన్నాయి. కాగ రీసెంట్ గా విజయ్ దేవరకొండ సైతం తన సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా వద్దు అంటూ మృణాల్ ఠాకూర్ ని పెట్టుకోవడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి.. విజయ్ తిన్నూరి దర్శకత్వంలో శ్రీలీలతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .

రీసెంట్ గానే విజయ్ దేవరకొండ మరో సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చాడు . గీతగోవిందం లాంటి హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పరశురాంపేట దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్న హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ. దీంతో రష్మిక – విజయ్ విడిపోయారు అంటూ మరోసారి ప్రచారం జరుగుతుంది .

ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. గీతగోవిందం లాంటి హిట్ కాంబో ని రిపీట్ చేయకుండా పరశురాం విజయ్ దేవరకొండ వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారు అంటే కచ్చితంగా అది వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం వల్లే అని అందుకే ..ఈ సినిమా లో మృణాల్ ని హీరోయిన్గా పెట్టుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news