Moviesభీఫ్ తినేవాడు రాముడా..? వేశ్యగా చేసిన ఆమె సీతాదేవి నా..? బుర్ర...

భీఫ్ తినేవాడు రాముడా..? వేశ్యగా చేసిన ఆమె సీతాదేవి నా..? బుర్ర ఉందారా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు భక్తి ఎక్కువైపోయింది . అందుకే పురాణాలను ఆధారంగా తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తూ భక్తిపార్వస్యంతో మునిగి తేలిపోతున్నారు. రీసెంట్గా ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లకు కోట్లు లాభాలు తీసుకొస్తున్న సరే.. ఇంకా ఈ సినిమాపై నెగటివ్ ట్రోలింగ్ జరుగుతూనే ఉంది . అయితే ఈ సినిమా హిట్టా పట్టా అన్న విషయం పక్కన పడితే ఈ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని త్వరలోనే బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ నితీష్ తివారి ఈ సినిమాకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దంగల్ – చిచోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్ నుండి రామాయణం సినిమా వస్తుంది అని తెలియడంతో బాలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కాగా తాజాగా ఆది పురుష్ సినిమా సరిగ్గా తీయలేదని ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఈ డైరెక్టర్ ఈ సినిమాలో హీరోగా రాముడిగా రణబీర్ కపూర్ ని.. సీతాదేవిగా అలియా భట్ ను చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి క్రమంలోనే జనాలు మండిపడుతున్నారు. బీఫ్ తినే రన్బీర్ కపూర్ రాముడా..? వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్ సీతాదేవి నా..? ఇంతకంటే నీచం మరొకటి ఉంటుందా ..?రామాయణాన్ని వక్రీకరించాలనుకుంటేనే ఇలాంటి వాళ్లను చూస్ చేసుకుంటారు..? అంటూ ఆయన పై ఫైర్ అవుతున్నారు . గంగుబాయి ఖతియవాడి వంటి సినిమాలో వేశ్య పాత్రలో నటించిన అలియా భట్ సీతాదేవి లాంటి పవిత్రమైన పాత్రకు ఎలా సూట్ అవుతుంది..? అంటూ మండిపడుతున్నారు .

అంతేకాదు ఒక వీడియోలో రణబీర్ కపూర్ ఓన్ గా చెప్పుకొచ్చాడు. నేను బీఫ్ తింటాను అని ..మరి అలాంటి ఆయన రాముడు అవుతాడ..? అంటూ ప్రశ్నిస్తున్నారు . దీనికి సమాధానం డైరెక్టర్ చెప్తేనే బాగుంటుంది అంటూ మిగతా జనాలు కూడా కౌంటర్ వేస్తున్నారు . ఏది ఏమైనా సరే రామాయణం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నా వాళ్లపై ఫాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news