Movies"ఆ రోజు ప్రభాస్ చేసిన పనికి చాలా బాధపడ్డా".. ఇంట్రెస్టింగ్ విషయాని...

“ఆ రోజు ప్రభాస్ చేసిన పనికి చాలా బాధపడ్డా”.. ఇంట్రెస్టింగ్ విషయాని బయటపెట్టిన ఐశ్వర్య రాజేష్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కొందరు హీరోయిన్స్ చూస్తే అభిమానులు చాలా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . పెద్దగా గ్లామర్ గా లేకపోయినా అందంగా లేకపోయినా సరే.. వాళ్ళని దేవతల పూజిస్తూ ఉంటారు . ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది డస్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్. పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య రాజేష్ .. రీసెంట్గా ఫర్హానా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఈ సినిమా ఎంత క్రేజీ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చూస్ చేసుకుని సినిమాలు చేసే ఐశ్వర్య రాజేష్ రీసెంట్గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగు ఇండస్ట్రీని ఓ పక్క పొగుడుతూనే మరోపక్క తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడం బాధాకరమని .. కోలీవుడ్లో ప్రజెంట్ పది సినిమాలు చేస్తున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది .

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ .. హీరో ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది . “తాను హీరోయిన్గా నటించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ..ఆ సినిమా రిలీజ్ టైం లోనే సాహో సినిమా కూడా రిలీజ్ చేశారని .. దీనితో మా చిన్న సినిమాకి దెబ్బ భారీగా పడిందని .. ఆ సినిమా కోసం నేను ఎంతో కష్టపడ్డాడని .. ఎన్నో రాత్రులు శ్రమించానని.. కంటెంట్ కధ బాగున్నప్పటికీ ప్రభాస్ సాహో సినిమా కారణంగా జనాలు మా సినిమాని ఎక్కువగా లైక్ చేయలేదని “చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ప్రభాస్ – ఐశ్వర్య రాజేష్ పేర్లు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news