Moviesసావిత్రి - ఏఎన్నార్ వాళ్ల‌తో క‌లిసి మందు కొడుతూ అలా చేసేవారా.....

సావిత్రి – ఏఎన్నార్ వాళ్ల‌తో క‌లిసి మందు కొడుతూ అలా చేసేవారా.. షాకింగ్ సీక్రెట్ రివీల్‌..!

దివంగ‌త లెజెండ్రీ హీరోయిన్ సావిత్రి ఎంత గొప్ప న‌టిగా ఎదిగారో కొన్ని వ్య‌స‌నాల వ‌ల్ల ఆమె కెరీర్ కూడా అంతే స్పీడ్‌గా చివ‌ర్లో ప‌త‌నం అయిపోయింది. సావిత్రి ప‌త‌నం అవ్వ‌డానికి ఆమె త‌న తాహ‌త‌కు మించి మ‌రీ గుప్త‌దానాలు చేసేవారు. ఆమెను ఎంతోమంది మోసం చేశారు. అలాగే త‌న కెరీర్‌లో ఆమె చేసిన పెద్ద త‌ప్పుల్లో జెమినీ గ‌ణేష్‌న్‌ను పెళ్లి చేసుకోవ‌డం. జెమినీ మోసం చేసి వ‌దిలేశాక సావిత్రి మ‌ద్యానికి, మ‌త్తు ప‌దార్థాల‌కు బాగా బానిస అయిపోయింది.

అస‌లు ఆమె కెరీర్ బాగా ఉచ్ఛ స్థితిలో ఉన్న‌ప్పుడే బాగా మ‌ద్యం సేవించేద‌ని అంటారు. వ‌రుస షూటింగ్‌లు, షెడ్యూల్స్‌తో అల‌సిపోయి ఆమె రాత్రిళ్లు మ‌ద్యం సేవించి కాస్త రిలాక్స్ అయ్యేవార‌ని అంటూ ఉంటారు. అయితే చివ‌ర‌కు అదే మ‌ద్యం సేవించ‌డం అనేది ఓ వ్య‌స‌నంగా మారిపోయి ఆమె కెరీర్ నాశ‌నం అయిపోయింది. మ‌హాన‌టి సినిమాలోనూ ఇది చూపించారు.

అయితే ఆమె త‌రం న‌టి అయిన‌.. రీసెంట్‌గా మృతిచెందిన జ‌మున కూడా కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సావిత్రి మ‌ద్యం సేవించేద‌న్న విష‌యాన్ని రివీల్ చేశారు. అంతే కాకుండా మూగ‌మ‌న‌సులు సినిమా టైంలో అమ‌లాపురంలో షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సావిత్రి, ఏఎన్నార్ ఇద్ద‌రూ క‌లిసి మందు కొట్ట‌డంతో పాటు త‌న‌ను కూడా కాస్త లైట్‌గా తీస్కోమ‌నేవార‌ని జ‌మున షాకింగ్ విష‌యాన్ని చెప్పింది.

అమ‌లాపురంలో షూటింగ్ జ‌రుగుతున్న రోజుల్లో ప్ర‌తి రోజు సాయంత్రం సావిత్రి, ఏఎన్నార్‌తో పాటు వాళ్లు బ‌స‌చేసిన ఇంటి ఓన‌ర్‌తో క‌లిసి మందు కొట్టేవార‌ని జ‌మున చెప్పారు. ఏఎన్నార్ అయితే జ‌మ‌న‌ను కూడా కొంచెం డ్రింక్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిద‌ని బ‌ల‌వంతం చేసేవార‌ట‌. అయితే ఆమె మాత్రం నిర్దాక్షిణ్యంగా ఇలాంటి వాటిల్లో న‌న్ను ఎంక‌రేజ్ చేయ‌వ‌ద్ద‌ని మొహం మీదే చెప్పేసేవార‌ట‌.

అంతెందుకు సీనియ‌ర్ న‌టుడు హ‌ర‌నాథ్ ఓ సారి షూటింగ్‌కు పిచ్చ‌గా తాగేసి తూలుతు వ‌చ్చార‌ట‌. వెంట‌నే జ‌మున అత‌డితో తాను యాక్ట్ చేయ‌లేన‌ని నిర్మాత‌కు చెప్ప‌డంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి మ‌రుస‌టి రోజు చేశార‌ట‌. ఈ విష‌యాన్ని జ‌మునే స్వ‌యంగా చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news