Movies' ఖుషి ' రీ రిలీజ్‌.. 2 రోజుల్లోనే మైండ్ బ్లాక్...

‘ ఖుషి ‘ రీ రిలీజ్‌.. 2 రోజుల్లోనే మైండ్ బ్లాక్ చేసే వ‌సూళ్లు.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఆప‌లేం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు దాటేసింది. ఖుషి అప్ప‌టి త‌రం యూత్‌ను ఎలా ఊపేసిందో అప్ప‌టి యువ‌త‌కు బాగా తెలుసు. అప్ప‌ట్లో 20ల్లో ఉన్న వాళ్లంతా ఇప్పుడు 40 ల్లోకి వ‌చ్చేసినా ఇప్ప‌ట‌కీ ఆ సినిమా స్మృతులు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఖుషి యువ‌త‌ను అప్ప‌ట్లో అంత‌లా ప్ర‌భావం చేసింది.

2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఖుషి సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా భూమిక హీరోయిన్‌గా న‌టించింది. అస‌లు ఈ సినిమాకు ముందుగా చెప్పాల‌ని ఉంది టైటిల్ అనుకున్నారు. ప‌వ‌న్‌కు జోడీగా బ‌ద్రి సినిమాలో న‌టించిన అమీషా ప‌టేల్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ప‌వ‌న్ – అమీషా మ‌ధ్య బొడ్డు సీన్ కూడా షూట్ చేశారు. త‌ర్వాత తేడా ఎక్క‌డ కొట్టిందో కాని అమీషా ప్లేసులో భూమిక‌ను తీసుకుని.. టైటిల్ కూడా ఖుషిగా మార్చేశారు.

ఆ రోజుల్లోనే 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఖుషి. ఇక ఇన్నేళ్ల‌కు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ న‌డుస్తుండ‌డంతో ఖుషిని కూడా రీ రిలీజ్ చేశారు. ఓ వైపు యూట్యూబ్‌లో ఫ్రీగా సినిమా ఉంది. ఓటీటీల్లో కూడా ఉంది. అయినా ఖుషి సినిమా రీ రిలీజ్ చేస్తే ప‌వ‌న్ ఫ్యాన్స్ విర‌గ‌బ‌డి చూశారు. ఎక్క‌డిక‌క్క‌డ సినిమాను భారీగా రిలీజ్ చేయ‌డంతో క‌లెక్ష‌న్ల మోత మోగించేసింది.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.6 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను సాధించ‌గా.. రెండో రోజూ కూడా ఆ జోరు చూపించింది. రెండో రోజు 1.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. రెండు రోజుల్లో రు. 5 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వ‌చ్చాయి. అస‌లు రీ రిలీజ్ మూవీకి ఈ రేంజ్ వ‌సూల్లు అంటే చాలా ఎక్కువ‌నే చెప్పాలి. సంక్రాంతి ముందు వ‌ర‌కు లేదా వారం రోజుల పాటు ఈ సినిమాను థియేట‌ర్ల‌లో వేస్తున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఇది మామూలు పండ‌గ కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news