Moviesఏంటి..ఊరుకుంటుంటే మరీ టూ మచ్ చేస్తున్నారు..వాళ్లకి రష్మిక మందన్న స్ట్రాంగ్ వార్నింగ్..!!

ఏంటి..ఊరుకుంటుంటే మరీ టూ మచ్ చేస్తున్నారు..వాళ్లకి రష్మిక మందన్న స్ట్రాంగ్ వార్నింగ్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకుంది . ఛలో అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు ..ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు, నితిన్ ,విజయ్ దేవరకొండ ,అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది.

కాగా ఈ మధ్యకాలంలో రష్మిక మందన గురించి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం .బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలు చేస్తున్న రష్మిక మందన స్టార్ హీరోతో ప్రేమాయణం లో మునిగి తేలిందని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. కొన్ని హాట్ కామెంట్స్ కూడా వినిపించాయి .ఇలాంటి క్రమంలోనే ఫైర్ అయిపోయింది రష్మిక మందన . సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రష్మిక మందన .సోషల్ మీడియా వేదికగా తన బాధను చెప్పుకొచ్చింది .

ఆమె పోస్ట్ చేస్తూ..” నాకు తెలుసు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందే ఇక్కడ నెగెటివిటీ ఉంటుందని.. అన్నిటికీ తెగించే నేను ఇక్కడికి వచ్చాను .కానీ మరి ఇంత నెగెటివిటీనా..? తట్టుకోలేకపోతున్నాను.. నేను ఏం తప్పు చేశానని నన్ను ద్వేషిస్తున్నారు.. నాపై ఉన్నవి లేనివి రాసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ..నన్ను ప్రేమించే జనాలు ఉన్నారు . వాళ్ళ కోసం నేను సినిమాలు చేస్తాను, కానీ ఇలాంటి తప్పుడు వార్తలు రాసి నన్ను బాధ పెట్టే హక్కు మీకు లేదు ..ఉన్నవి ఉన్నట్టు రాయండి తప్పులేదు ..కల్పించుకొని రాయద్దు . నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మీరు వ్యంగంగా మార్చి నా పై ట్రోలింగ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు . అసలు ఇలాంటి వాటి పైన స్పందించకూడదు అనుకున్నాను ..రోజురోజుకీ ఇలాంటి ట్రోలింగ్ ఎక్కువైపోతుంది చూసి తట్టుకోలేకపోయాను.. అందుకే ఇలా స్పందించాల్సి వస్తుంది”అంటూ ఘాటుగా ట్రోలర్స్ పై స్పందించింది రష్మిక మందన్నా. దీంతో రష్మిక మందన పోస్ట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news