Newsకొంప ముంచేసిన జాన్వీ కపూర్.. ఏం చేసిందో తెలుసా..?

కొంప ముంచేసిన జాన్వీ కపూర్.. ఏం చేసిందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం గొప్ప కాదు.. మంచి మంచి సినిమాలు చేసి అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకోవడం ముఖ్యం . అలా వచ్చిన మొదటి సినిమాతోనే యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని స్టార్ డాటర్ జాన్వికపూర్. అందాల తారగా పేరు సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్. ఆమె బ్రతికున్న టైంలో జాన్వీని హీరోయిన్గా చూడాలని చాలా ఆశపడింది .

కానీ అది కుదరలేదు . కాగా ప్రజెంట్ ఇప్పుడు బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది . కాగా రీసెంట్గా ఆమె నటించిన సినిమా మిలీ . ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న జాన్వీ..రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం తాను ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టింది . ఈ సినిమా కోసం ఏకంగా 20 రోజులపాటు సినిమాకి కీలకమైన..తనకి క్లిష్టమైన సీన్లో నటించానని.. అది కూడా మైనస్ 15 డిగ్రీల చల్లదనంలో నటించి..కళ్లు తిరి పడిపోయి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించిందని.. ఇక ఆ టైంలో డైరెక్టర్ తగిన జాగ్రత్తలతో నన్ను ఈ సీన్ కంప్లీట్ చేయించాడని.. ఏమాత్రం అజాగ్రత్త తీసుకొని ఉన్న నేను ఇప్పుడు మీ ముందు ఉండేదాన్ని కాదని చెప్పుకొచ్చిందట .

అంతేకాదు ఈ రోజుల్లో ఫ్రీజర్ వాతావరణం క్రియేట్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ నేచురల్ లుక్ కోసం జాన్విని చాలా కష్టపెట్టారట. అంతే కాదు జాన్వి కూడా అమ్మ పేరు నిలబెట్టుకోవడానికి నాచురల్ యాక్టింగ్ కోసం అలాంటి సీన్స్ లో నటించిందట. చూద్దాం మిలి సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో జాన్వికి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news