Movies"మా అమ్మ చివరి కోరిక అదే..ఖచ్చితంగా తీరుస్తాను"..జాన్వీ ఎమోషనల్..!!

“మా అమ్మ చివరి కోరిక అదే..ఖచ్చితంగా తీరుస్తాను”..జాన్వీ ఎమోషనల్..!!

సినీ ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతల పేరు చెప్పుకొని చాలామంది వచ్చారు ..కానీ చాలా తక్కువ మంది మాత్రమే అమ్మ పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా సెటిల్ అయ్యారు.. అలాంటివారిలో స్టార్ డాటర్ జాన్వీ కపూర్ కూడా ఒకరు. అందాల ముద్దుగుమ్మ అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వి కపూర్.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న జాన్వికపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే .అందంలోనూ నటనలోనూ అమ్మని మించిపోయే గుణాలు అమ్మడుకు చాలానే ఉన్నాయి. కాగా అంత టాలెంట్ ఉన్నా కానీ ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అవుతున్న జాన్వీ కపూర్ రీసెంట్గా “మిల్లీ ” అనే సినిమాలో నటించింది . ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే ఈ క్రమంలోనే జాన్వికపూర్ వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది .

ఈ క్రమంలోని జాన్వి కపూర్ తాజాగా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లి చివరి కోరిక గురించి చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ..”మా అమ్మగారు బ్రతికున్నప్పుడు నన్ను హీరోయిన్ గా చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు . అయితే ఇప్పుడు ఆమె లేని లోటు నాకు బాగా తెలుస్తుంది . ఆమె కన్న కళలను నేను నిజం చేస్తాను ..మా అమ్మగారికి నేను బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్లో నటించాలి అన్నది కోరిక ..కచ్చితంగా ఆ కోరిక తీరుస్తా..”అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. దీంతో శ్రీదేవి అభిమానులు జాన్వి కపూర్ మాటలకు ఎమోషన్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news