Moviesఇక పై ప్రభాస్, మహేష్ ల సినిమాలు నిర్మించనంటున్న ఆ స్టార్...

ఇక పై ప్రభాస్, మహేష్ ల సినిమాలు నిర్మించనంటున్న ఆ స్టార్ నిర్మాత..రీజన్ వింటే షాకే!!

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది నిర్మాతలు ఉన్న కొందరు ప్రోడ్యూసర్స్ అంటే జనాలకు అదో పిచ్చి. వాళ్ల పై తెలియని నమ్మకం. కాంబో లు కూడా అలానే సెట్ అవుతాయి. ఒకప్పుడు బడా బడా సినిమాలను నిర్మించిన ఎం ఎస్ రాజు..ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇది రీజన్ అని కరెక్ట్ గా చెప్పలేం కానీ, ఆయన్ ఓ స్టార్ హీరో సినిమాని ఎంతో నమ్మకంగా తీసి..కోట్లు నష్టపోయారట. ఆ రీజన్ తోనే రాజుగారు ఇండస్ట్రీకి కొన్నాళ్ళు దూరంగా ఉన్నాడు అనే టాక్ వినిపించింది.

కాగా, మధ్య లో ఓ సారి డర్టి హరి అంటు ఓ సినిమా తీశాడు. ఆ సినిమా రిజల్డ్ మనకు తెలిసిందే. కాగాం, మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎం ఎస్ రాజు మరో సినిమా ని డైరెక్ట్ చేశాడు. తన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా 7 డేస్ 6 నైట్స్ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..ఆయన ఆలీతో సరదాగా షోకు గెస్ట్ గా వచ్చారు. చాలా సినిమాల గురించి, హీరోల చర్చించిన ఈయన..ఈ షో హీరో ప్రభాస్, మహేశ్ ల పై ఊహించని కామెంట్స్ చేశారు.

గతంలో వాళ్ళతో పని చేసిన ఎక్స్ పీరియన్స్ గుర్తు చేసుకుని..పలు ఇంట్రెస్తింగ్ విషయాలు బయట పెట్టిన ఆయన..ప్రభాస్ “పౌర్ణమి” సినిమా తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో చాలా మంది హీరోలు వచ్చి..సినిమాను ప్రోడ్యూస్ చెయ్యండి అని అడిగారని. కానీ, ఆ టైంలో తాను సినిమాలు నిర్మించకూడదు అని గట్టిగా అనుకున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా..మహేశ్, ప్రభాస్ లాంటి పెద్ద స్టార్స్ అయినా సినిమాలు నిర్మించను అని..తనకు కధ నచ్చి..లైక్ చేస్తేనే సినిమాలు నిర్మిస్తానని చెప్పుకురావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news