Moviesసొంత బ్యానర్‌లో బాలయ్య కొడుకు లాంఛింగ్ ప్రాజెక్ట్..అలా ప్లాన్ చేశారా..?

సొంత బ్యానర్‌లో బాలయ్య కొడుకు లాంఛింగ్ ప్రాజెక్ట్..అలా ప్లాన్ చేశారా..?

నందమూరి వారసుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా కనిపిస్తాడా..? అని దాదాపు నాలుగైదేళ్ళుగా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఇండస్ట్రీలోనూ ఎంతో కాలంగా అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక బి.గోపాల్ వంటి సీనియర్ దర్శకుల నుంచి బాలయ్యతో పైసా వసూల్ చేయించిన పూరి జగన్నాథ్ వరకూ చాలామంది దర్శకులు బాలయ్య, తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత ఎప్పుడు అప్పగిస్తారా అని చూస్తున్నారు.

ఇప్పటికే, మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేందుకు వి వి వినాయక్, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, బి గోపాల్ వంటి వారు కథలను సిద్ధం చేసుకున్నారు కూడా. కొందరేమో వినాయక్ అయితే పర్ఫెక్ట్ అని అభిప్రాయపడుతుంటే ఇంకొందరు బాలయ్యకు వరుస హిట్స్ ఇస్తున్న బోయపాటి శ్రీను కరెక్ట్ అని అంటున్నారు. వీరికంటే కూడా మెజారిటీ భాగం హీరోను మాస్ యాంగిల్‌లో అన్నీ వర్గాల ప్రేక్షకులు ఆదరించాలంటే పక్కా పూరి జగన్నాథ్ కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్‌ను కూడా పూరి పరిచయం చేశాడు కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో తగ్గకూడదని మోక్షజ్ఞను పూరి ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నారు.

ఇక బాలయ్య మాత్రం ఇంకా ఏ దర్శకుడి చేతిలో పెట్టాలనే విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. అసలు కంగారు పడకుండా మంచి సమయం చూసి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారు. కథలను మాత్రం ఇప్పటికే బాలయ్య సెలెక్ట్ చేసి పెట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇటీవల బాలయ్య తన తండ్రి నందమూరి తారకరామారావు 100వ జయంతి సందర్భంగా బసవతారక రామా క్రియేషన్స్ అనే పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు.

ఇప్పుడు మోక్షజ్ఞను ఈ సంస్థలోనే హీరోగా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు, బాలయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు గానీ బాలయ్య కొడు హీరోగా ఆయన దర్శకత్వంలో ఇండస్ట్రీకి ఎంట్రీ అంటే మాత్రం ఇదొక చరిత్రగా మిగులుతుందని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news