Moviesఅలా చేస్తే తాట తీస్తా..వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శంకర్..?

అలా చేస్తే తాట తీస్తా..వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శంకర్..?

మెగా వారసుడు రాం చరణ్.. బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండడం..అలాగే రాజమౌళి డైరెక్షన్ లో నటించిన తరువాత చరణ్ ఈ సినిమాలో నటిస్తుండడంతో ..అభిమానులు ఈ సినిమా పై భారీ స్దాయిలో అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కీయరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. అయితే , ఈ సినిమాలో ఓ జర్నలిస్ట్ క్యారెక్టర్లో నేషనల్ క్రష్ రష్మిక మదన్నా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి అమ్మడు భారీగానే పారితోషకం డిమాడ్ చేసిందట.

ఇంతమంది స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.ఈ భారీ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే సమాచారం ఫిలిం నగర్ నుంచి వినిపిస్తోంది. ఇందులో ఒకటి సాధారణమైన వ్యక్తి రోల్ కాగా, మరొకటి మాత్రం చాలా సీరియస్ గెటప్ అని అంటున్నారు. రామ్ చరణ్ పాత్రపై శంకర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే రాజమండ్రీలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ టైంలో చాలా మంది కనాలు అక్కడ గుంపు కూడి ఫోటోలు, వీడియోలు తీసున్నట్లు ఉన్నారు. దీంతో చిత్ర బృందం ముందు జాగ్రత్తల్లో చర్య గా లీకు రాయళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.

 

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ లీక్ రాయుళ్లకు సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇస్తూ..”సినిమా షూటింగ్ తైంలో అవసరాలబట్టి బహిరంగా ప్రదేశాల్లో జనసందోహంతో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉందంది. మీరు తీసిన ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే..అది చట్ట విరుద్ధంగా తీసిన వీడియోస్, ఫోటోస్ నే వౌతాయి. ఇక అలాంటి వారి పై సివీయర్ యాక్షన్ తీసుకుంటాము. అనధికారిక కంటెంట్ పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ వైరస్ టీమ్ చర్య తీసుకుంటుంది” అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు మేకర్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news