Moviesఆ రోజు నందమూరి ఫ్యాన్స్‌కు "ఐ ఫీస్ట్"..కోట్లాది మంది అభిమానుల కోరిక...

ఆ రోజు నందమూరి ఫ్యాన్స్‌కు “ఐ ఫీస్ట్”..కోట్లాది మంది అభిమానుల కోరిక అదేగా.?

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా అల్లు వారి ఆహాలో ఓ టాక్ షో స్టార్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అన్‌స్టాప్‌బుల్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోన్న ఈ షోపై ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. అటు అల్లు వారి ఓటీటీ.. ఇటు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్ కావ‌డంతో ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది. ఇక ఈ షోకు ఫస్ట్ గెస్ట్ గా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజై యుట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో దూసుకుపోతుంది.

‘అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో రానున్న ఈ షోకు వరుసగా స్టార్ సెలబ్రెటీస్ రానున్నట్లు ఇప్పటికే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పక్కా తెలుగు ఓటిటి ‘ఆహా’లో నవంబర్ 4న “అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే” షో మొదలుకానుంది. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోతో హీరో బాలకృష్ణ తన డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బాలయ్య ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మొదట గెస్ట్ గా మోహన్ బాబు వచ్చిన ఈ షో కు రెండో గెస్ట్ గా దగ్గుబాటిన్ వారసుడు రానా వచ్చారట. ఆ తరువాత మూడో గెస్ట్ గా నాని వచ్చిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఆ తరువాత వచ్చిన గెస్ట్ పేరు చెబ్బితే నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు రావడ గ్యారెంటీ అని చెప్పవచ్చు. నందమూరి అభిమానులు ఎప్పుదెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం అది. ఒకే స్క్రీన్ పై నట సిమ్హం బాల కృష్ణ..యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఇద్దరు అభిమానుల కొసం ఆహా లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.

 

యస్.. తాజాగా మదుతున్న సమాచారం ప్రకారం చూస్తే.. “అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్బీకే” షో కు నాలుగవ గెస్ట్ గా తారక్ వస్తున్నారట. ఈ షో ఫస్ట్ సీజన్‌ను సంచలనంగా మార్చేందుకు అల్లు అరవింద్ ఇలా ప్లాన్ చేసిన్నట్లు తాక్ వినిపిస్తుంది. యంగ్ టైగర్ గెస్ట్ గా, బాలయ్య హోస్ట్ గా అనే విషయం ఊహించుకుంటేనే అభిమానుల మనసులు ఉప్పొంగుతాయి. ఇక ఈ ఎపిసోడ్ తెలికాస్ట్ అయ్యే రోజు ఉంటాదు చూడండి.. TRPs నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news