Gossipsఆ ఒక్క సినిమా కోసం ప్రభాస్ కళ్లు చెదిరే పారితోషికం.. తన...

ఆ ఒక్క సినిమా కోసం ప్రభాస్ కళ్లు చెదిరే పారితోషికం.. తన సినీ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..?

ప్రభాస్‌.. ఈ పేరు వింటేనే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఈ టాలీవుడ్‌ హీరో బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన మన్ డార్లింగ్.. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకునారు. రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌,సలార్ సినిమాలు చేస్తున్నాడు. ఇక బాహుబలి సిరీస్‌తో తెలుగు ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన ఈ హీరో ఒక్క సినిమాకు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్  ఆదిపురుష్ సినిమా కోసం కళ్ళు చెదిరే పారితోషకం పుచ్చుకుంటున్నాడట. ఇకా ఆ అమౌంట్ చూసి బడా నిర్మాతలు సైతం తెలిసి ఖంగుతింటున్నారట. మరికొందరు మాత్రం ప్రభాస్‌ ఉన్న క్రేజ్ కి ఆ మాత్రం తీసుకోక పోతే ఎలా అంటున్నారు. ఇంతకి ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?? ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా కోసం అక్షరాల 150 కోట్లు అందుకున్నాడట. టాలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తం అందుకుంది ప్రభాస్‌ ఒక్కడేనని, దక్షిణాదిలో కూడా ఇంత రెమ్యునరేషన్‌ అందుకున్నవాళ్లెవరూ లేరని ఆయన అభిమానులు అంటున్నారు.

బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీలో ప్రభాస్ రాముడిగా చేస్తుండగా.. కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్, లక్ష్మణ పాత్రలో సన్నీ సింగ్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీకి 50 రోజులు డేట్స్ ఇచ్చిన డార్లింగ్, రోజుకు రూ.3 కోట్లు చొప్పున 50 రోజులకి రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఇక ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ స్టార్ హీరో అందుకోనటువంటి భారీ రెమ్యునరేషన్ ప్రభాస్ అందుకుంటున్నట్లే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news