Moviesమ‌హేష్‌బాబుతో అలా ప్రేమ‌లో ప‌డ్డానంటోన్న న‌మ్ర‌త‌..!

మ‌హేష్‌బాబుతో అలా ప్రేమ‌లో ప‌డ్డానంటోన్న న‌మ్ర‌త‌..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – న‌మ్ర‌త దంప‌తుల‌ది ప్రేమ వివాహం అన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్ప‌టి మిస్ ఇండియా అయిన న‌మ్ర‌త బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న స‌మ‌యంలో తెలుగులో మ‌హేష్‌బాబు తో వంశీ సినిమా చేశారు. ఆ స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మార‌డంతో వారు 2005లో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంప‌తుల‌కు గౌత‌మ్‌, సితార పిల్ల‌లు ఉన్నారు. అయితే వీరి పెళ్లికి ముందు కృష్ణ ఫ్యామిలీ ఒప్పుకోలేద‌ని కూడా అంటారు. ఇక తాజాగా ఓ ప్ర‌ముఖ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. తాము తొలిసారి క‌లుసుకున్న‌ప్పుడే ఒక‌రినొక‌రు ఎక్కువ టైం చూసుకునేందుకు ఇష్ట‌ప‌డే వాళ్ల‌మ‌ని.. త‌ర్వాత రెండేళ్ల‌కు అది ప్రేమ‌గా మారింద‌ని న‌మ్ర‌త చెప్పారు.

మ‌హేష్‌ను ఫ‌స్ట్ టైం చూసిన‌ప్పుడే త‌న‌కు ప్ర‌త్యేక‌మైన అనుభూతి క‌లిగింద‌న్నారు. అత‌డు చాలా ఇన్నోసెంట్ అని.. త‌న భ‌ర్తగా రావ‌డం చాలా అదృష్ట‌మ‌ని న‌మ్ర‌త చెప్పారు. ఇక వీరి దాంప‌త్య జీవితం 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక పెళ్లి త‌ర్వాత న‌మ్ర‌త సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news