Moviesగత ప‌దేళ్లు దాచుకున్న.. తనకు ఎంతో ఇష్టమైన ఫొటో చూపించిన అఖిల్..ఎవరిదో...

గత ప‌దేళ్లు దాచుకున్న.. తనకు ఎంతో ఇష్టమైన ఫొటో చూపించిన అఖిల్..ఎవరిదో మీరు చూసేయండి ..!!

అక్కినేని నాగార్జున వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్‌. తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్‌.. రెండో సినిమా హ‌లోను సొంతంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.. కాస్ట్ ఫెయిల్యూర్‌.. మూడో సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను ల‌వ్ స్టోరీగా చేసినా ప్లాప్ అయ్యింది. దీంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరీ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా చేశాడు.

త్వ‌ర‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు అఖిల్‌. క‌థానాయ‌కుడిగా చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాపైనే ఆశ‌ల‌ను ప‌ట్టుకున్నాడు అక్కినేని అఖిల్‌. ఈ మూవీ అక్టోబ‌ర్ 15న విడుద‌ల‌వుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆయ‌న ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తను దాదాపు ప‌దేళ్ల నుంచి దాచుకున్న ఫోటో గురించి రివీల్ చేసాడు.

అంతేకాదు త‌న‌కిష్ట‌మైన ఫొటో ఏంటో అంద‌రికీ చూపించాడు అఖిల్‌. ఇంతకి ఆ ఫోటో ఎవరిదో తెలుసా..?? వాళ్ల తాతగారు నాగేశ్వర రావు గారిదే. తన ఫోన్ ఎప్పుడైనా స్విఛాన్ చేయ‌గానే ఆ ఫొటో నే చూస్తూ ఉంటాడట. ఆయన మొబైల్స్ ఎన్ని మార్చినా ఆ ఫొటో మాత్రం స్థిరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక అఖిల్ చూయించిన ఫోటో స్పెషాలిటీ ఏంటో తెలుసా..??ఆ ఫోటో ఏసినిమాలో తీసిన ఫొటో కాదు. నాగేశ్వర రావు ఓ సినిమాకు ఆడిష‌న్ చేస్తున్న స‌మ‌యంలో ఫొటోగ్రాఫ‌ర్ తీసిన ఫొటో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news