Moviesచెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తీసుకుంటుందో తెలిస్తే..దిమ్మ...

చెల్లి పాత్ర కోసం కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఎంతో తీసుకుంటుందో తెలిస్తే..దిమ్మ తిరగాల్సిందే..?

టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి..కుర్ర హీరోలకి ఏమాత్రం తీసిపోని విధంగా..వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిరంజీవి.. ప్రస్తుతం మలయాళ ‘లూసిఫర్’ తోపాటుగా తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

అయితే 2015లో అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన వేదాళం మూవీ రీమేక్ లో చిరంజీవి నటించనున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ”బోళా శంకర్‌” అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ మూవీలో చెల్లెలు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.

అయితే వేదాళం తెలుగు రీమేక్ లో చిరంజీవి చెల్లెలు పాత్ర కోసం మహానటి సినిమాతొ టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయిన కీర్తి సురేష్ ని పెట్టనున్నారని వార్తలు జోరుగా వినిపించాయి. ఆ తరువాత కాదు కాదు ఆ పాత్రకు కీర్తి నో చెప్పింది..ఇప్పుడు ఆ పాత్ర రౌడీ బేబీ సాయి పల్లవి చేస్తుంది అని వార్తలు షికార్లు చేసాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ..చిత్ర బృందం రాఖీ పండుగ సంధర్బంగా..ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియోలో కీర్తి సురేష్ చిరంజీవికి రాఖీ కడుతూ ఉంటుంది.

దీంతో ఈ సినిమా లో చెల్లెలు గా కీర్తి సురేష్ ఫనల్ అంటూ ఫిస్ అయ్యిపోయింది. ఈ పాత్ర కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చెల్లి గా నటిస్తున్నందుకు గను..ఈ సినిమాకు ఏకంగా మూడు కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. ఇక వేదాళం’ ఒరిజినల్ వెర్సన్ లో అజిత్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తే.. చెల్లెలుగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఇప్పుడు మెగా రీమేక్ లో లక్ష్మీ మీనన్ పాత్రలో కీర్తి ఫైనల్ అయ్యింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news