Moviesగుర్ర‌పు పందేల‌పై బెట్టింగుల్లో సీనియ‌ర్ హీరోయిన్‌..!

గుర్ర‌పు పందేల‌పై బెట్టింగుల్లో సీనియ‌ర్ హీరోయిన్‌..!

సినిమా వాళ్ల‌కు ర‌క‌ర‌కాల అల‌వాట్లు ఉంటాయి. అలాగే ర‌క‌ర‌కాల బెట్టింగులు కూడా చేస్తుంటారు. ఇదిలా ఉంటే సీనియ‌ర్ హీరోయిన్ ల‌క్ష్మి కూడా ఒకానొక స‌మ‌యంలో గుర్ర‌పు పందాల‌పై బెట్టింగులు క‌ట్టార‌ట‌. ఈ విష‌యాన్ని ఆమే గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. సీనియ‌ర్ న‌టి అయిన ల‌క్ష్మి ఓ క‌న్న‌డ సినిమా షూటింగ్ కోసం బెంగ‌ళూరు వెళ్లారు. ఆ టైంలో త‌న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో క‌లిసి గుర్ర‌పు రేస్‌ల‌కు వెళ్లింద‌ట‌. ఆమెకు రేస్‌ల‌కు వెళ్లే అల‌వాటు లేక‌పోయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒత్తిడి చేయ‌డంతో స‌ర‌దాగా ఈ రేస్‌ల‌కు వెళ్లింద‌ట‌.

అక్క‌డ ఆ గుర్ర‌పు రేస్‌ల‌ను ఎంజాయ్ చేసిన ల‌క్ష్మీ ఓ గుర్రంపై పందెం క‌ట్టింద‌ట‌. కేవ‌లం రు. 5 పందెం క‌డితే ల‌క్ష్మీ పందెం క‌ట్టిన గుర్రం గెల‌వ‌డంతో ఆమెకు ఏకంగా రు. 500 వ‌చ్చాయ‌ట‌. ఆ పందెం గెల‌వ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయ‌ట‌. పందెంలో గెలిచినా కూడా ఆమె మ‌న‌స్సు సంతృప్తిగా లేద‌ట‌. తాను ఈ డ‌బ్బు క‌ష్ట‌ప‌డి సంపాదించ‌లేద‌ని.. అన్యాయంగానే ఈ డ‌బ్బులు వ‌చ్చాయ‌న్న భావ‌న ఆమె మ‌న‌స్సులో క‌లిగింద‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆ డ‌బ్బును త‌న వ‌ద్ద ఉంచుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని.. దానిని పేద‌ల‌కు పంచి పెట్టేసింద‌ట‌. ఆ త‌ర్వాత ఆమె ఎప్పుడూ కూడా మ‌ళ్లీ గుర్ర‌పు రేస్‌ల‌పై బెట్టింగ్‌లు కాయ‌డం కాదు క‌దా.. క‌నీసం ఆ చాయ‌ల‌కు కూడా వెళ్ల‌లేద‌ట‌. ఇక గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న ల‌క్ష్మి ఇటీవ‌లే నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఓ బేబీ సినిమాలో న‌టించి విమ‌ర్శ‌కుల మెప్పు పొందింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news