Gossipsషాకింగ్ బ్రేకింగ్ న్యూస్ : బాహుబలిని మించి ఎన్టీఆర్ రానా...

షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ : బాహుబలిని మించి ఎన్టీఆర్ రానా ల కొత్త సినిమా

గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి సినిమా వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావచ్చింది. ఇంతవరకు అఫీషియల్ గా తన తర్వాత సినిమాపై ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. ఫిలిం నగర్ లో మాత్రం గుణ శేఖర్ దగ్గర ఎన్టీఆర్ మరియు రానా దగ్గుబాటి కాంబినేషన్ లో “హిరణ్యకశ్యపుడు” అనే బిగ్ బడ్జెట్ సినిమా కథ రెడీగా ఉందని, దానికి రానా సై అన్నాడని మరియు ఎన్టీఆర్ కూడా నరసింహ అవతారంలో మనకి కనిపించనున్నారని టాక్.అదే గనుక నిజమైతే ప్రేక్షకులకి బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వస్తున్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకున్న బడ్జెట్ లో రుద్రమదేవి మరియు బాల రామాయణం లాంటి సినిమాలని బాగానే తెరకెక్కించిన అనుభవం గుణశేఖర్ కి ఉంది. ప్రస్తుతం రానా, తేజ దర్శకత్వం లో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ మరియు క్యాథెరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.

https://youtu.be/aQjTDpUV9Kw

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news