Movies"ఆ టైంలో అది ఎంజాయ్ చేయలేకపోయాను".. ఇన్నాళ్ళకు అసలు విషయాన్ని బయటపెట్టిన...

“ఆ టైంలో అది ఎంజాయ్ చేయలేకపోయాను”.. ఇన్నాళ్ళకు అసలు విషయాన్ని బయటపెట్టిన హీరోయిన్ సమంత..!

సమంత .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ . “ఏం మాయ చేసావే” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎలా తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది అన్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 లో సామ్ హాజరయ్యారు ..స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు .

ఈ సందర్భంగా తన కెరీర్ కి సంబంధించి అలాగే మయోసైటీస్ వ్యాధి వచ్చినప్పుడు తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి క్రేజీ క్రేజీ కామెంట్స్ చేశారు . కొన్ని పరిస్థితుల వల్లే కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని బయట పెట్టారు . సమంత మాట్లాడుతూ ..”నేను నటిగా దాదాపు 14 ఏళ్ళు కంప్లీట్ చేసేసుకున్నాను.. ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాను .. కొన్నిసార్లు కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్ర పోయిన రోజులు కూడా ఉన్నాయి. “..

“నా కెరియర్ లో కొన్ని బాధపడిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. బాధ పడిన క్షణాలు కూడా ఉన్నాయి .. కానీ నేను ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు ..ఇంపోస్టర్ సిండ్రోమ్ దాచిపెట్టి కెరియర్లో అగ్రస్థానంలో ఉన్న క్షణాల్లో నేను ఆస్వాదించలేకపోయాను .. చాలా సినిమాలు హిట్ అయి సక్సెస్ సాధించిన ఆ ఎంజాయ్మెంట్ అనుభవించలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు మయోసైటిస్ కారణంగా తాను ఎంతో ఇష్టంగా నటించిన యశోద ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది అని బాధ పడ్డారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మయోసైటీస్ టైంలో సమంత ఇంత బాధపడిందా..?? అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news