Moviesఒళ్లు గిరగిరా తిప్పేసే సాయిపల్లవికే.. మూడు చెరువుల నీళ్లు తాపించి చెమటలు...

ఒళ్లు గిరగిరా తిప్పేసే సాయిపల్లవికే.. మూడు చెరువుల నీళ్లు తాపించి చెమటలు పట్టించిన పాట ఏంటో తెలుసా..?

సాయి పల్లవి .. ఈ పేరు చెప్తే జనాల అందరికీ ముందుగా గుర్తొచ్చేది చక్కటి రూపం.. చక్కటి చిరునవ్వు . అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకునింది మలయాళీ బ్యూటీ . పేరుకి మలయాళీ బ్యూటీ అయినా తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది . పలు సినిమాల్లో నటించి లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. ప్రెసెంట్ చాలా సినిమాల్లో నటించడానికి ఆఫర్స్ వస్తున్నా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది .

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయిపల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి . హీరోయిన్ సాయి పల్లవి డాన్స్ బాగా చేస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోయిన్స్ లోకి సాయి పల్లవి ది బెస్ట్ డాన్సర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఒళ్ళుని గిరగిరా తిప్పేస్తుంది .. రౌడీ బేబీ సాంగ్ లో ధనుష్ కంటే అందరికళ్లు సాయి పల్లవి పైన పడ్డాయి అని చెప్పల తప్పదు . అలాంటి సాయి పల్లవికి ఒక పాటకి డాన్స్ చేయడం చాలా కష్టంగా మారిందట . ఆ పాట చిరంజీవి పాట కావడం గమనార్హం.

ముఠామేస్త్రి చిత్రంలోని మార్కెట్లో వచ్చే టైటిల్ సాంగ్ మూమెంట్స్ కోసం చాలా సార్లు ట్రై చేసిందట . కానీ తనకు ఆ గ్రేస్.. మూమెంట్స్ రాలేదట. ఇప్పటికీ ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ అలా చేయలేకపోయానని ఎప్పటికైనా సరే చిరంజీవి గారి లాగా ఆ పాటలో డాన్స్ చేయాలి అని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది . అంతేకాదు ఏం చేసినా ఆడపిల్లని అని.. అది మగవాళ్ళు చేసే విధానం అని అందుకే చిరంజీవికి సాధ్యమైంది అని కూడా తెలిపింది . ప్రజెంట్ ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news