Movies"అలా చేస్తే ఎవడు రా సినిమాలు చూస్తాడు..?" రష్మిక మందన్న సెన్సేషనల్...

“అలా చేస్తే ఎవడు రా సినిమాలు చూస్తాడు..?” రష్మిక మందన్న సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలకి ఉపయోగకరమైన పనులు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కానీ.. దానికంటే డబల్ రేంజ్ లో మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు బాగానే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియా గ్రిప్ లో పెట్టుకుంది అనే చెప్పాలి. ఒక సినిమాకి పబ్లిసిటీ కావాలి అన్నా సినిమా ప్రమోషన్స్ నిర్వహించాలి అన్నా సోషల్ మీడియా కి రోల్ ప్లే చేస్తుంది .

కొన్నిసార్లు సినిమా సభ్యులు రిలీజ్ చేయకముందే సినిమాకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సోషల్ మీడియాలో లీక్ అయిపోతూ ఉంటాయి. కొన్ని సినిమాలు రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో లీకైన సందర్భాలు ఉన్నాయి . తాజాగా పుష్ప2 సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ పిక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అల్లు అర్జున్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప2 సెట్స్ నుంచి ఆయన చీర కట్టుకొని ఉన్న ఫోటో ఒకటి లీక్ అయి వైరల్ గా మారింది .

అఫ్కోర్స్ ఇది సినిమాకి మరింత హైప్ పెంచింది . కానీ సినిమా యూనిట్ మాత్రం పుష్ప 2 సెట్స్ నుంచి ఈ ఫోటో లీక్ అవ్వడంపై మండిపడుతున్నారు. “భారీ బడ్జెట్ తో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు లీక్ అయితే సినిమాకి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది అని మండిపడుతున్నారు” . రీసెంట్గా ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించిన రష్మిక మందన్నా.. సైతం ఫైర్ అయింది .. సినిమా రిలీజ్ కి ముందే ఇలా పిక్స్ లీక్ అయిపోతూ ఉంటే సినిమాపై ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది .. ఎవరు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారు .. ఇలా ఫోటోలు లీక్ చేయడం తప్పు సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇంకా ఇంకా తప్పు .. ఏమాత్రం భావ్యం కాదు . పుష్ప2 పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమాని థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి.. ఈ సినిమా కోసం టీం చాలా చాలా కష్టపడుతుంది” అంటూ తనదైన స్టైల్ లో ఘాటుగా రెస్పాండ్ అయింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news