Moviesఓరి దేవుడోయ్..కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరో...

ఓరి దేవుడోయ్..కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరో తెలుసా..? ఆ మహానుభావుడు ఇతడే..!!

కుమారి ఆంటీ .. ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా కుమారి ఆంటీ కి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. హైదరాబాదులోని దుర్గం చెరువు బ్రిడ్జి సమీపంలో ఒక హోటల్ పెట్టుకొని తన లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది .ఆమె ఫుడ్ తినడానికి పక్క స్టేట్ నుంచి కూడా జనాలు వస్తూ ఉండడం గమనార్హం .

కుమారి ఆంటీ నెలకు 1,80,000 పైగానే సంపాదిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాగా పాపులారిటీ దక్కించుకోవడంతో పలు షోస్ నుంచి కూడా కుమారి ఆంటీకి ఆఫర్లు వస్తున్నాయట . అంతేకాదు కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళబోతుంది అంటున్నారు జనాలు . రీసెంట్గా కుమారి ఆంటీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది .

కుమారి ఆంటీ హోటల్ పెట్టడానికి మెయిన్ రీజన్ సింగర్ హేమచంద్ర అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె మొదటగా వాళ్ళ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేసేదట. ఆయన ఇచ్చిన 30 వేల డబ్బుతోనే హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసిందట . ఇప్పుడు అదే ఆమెకు బిగ్ ప్లస్ పాయింట్ గా మారిపోయిందట. ఇదే విషయాని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news