Movies"గుంటూరు కారం" సినిమాలో పూజా తర్వాత .. శ్రీలీల కన్నా ముందు...

“గుంటూరు కారం” సినిమాలో పూజా తర్వాత .. శ్రీలీల కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

గుంటూరు కారం ..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ఏకంగా 164 కోట్లు కలెక్ట్ చేసింది . అయితే ఇదంతా ఫేక్ లెక్కలు అని సినిమా అట్టర్ ఫ్లాప్ అని కొందరు వాదిస్తున్నారు. సినిమా హిట్టా ఫట్టా అని పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా మాత్రం టీం ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు . కానీ కొన్ని కారణాల చేత ఆమెను తీసేశారు . అయితే పూజా హెగ్డే తర్వాత శ్రీలీలాని ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీ లీల కన్నా ముందు పూజా తర్వాత ఈ సినిమాలో రష్మిక మందన్నాను హీరోయిన్గా అనుకున్నారట త్రివిక్రమ్ .

కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. అప్పటికే పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రష్మిక ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికి రష్మిక మందన్నా ఈ పాత్ర రిజెక్ట్ చేసి మంచి పనే చేసింది . సినిమాలో నటించిన శ్రీ లీలాకే పెద్దగా పేరు వచ్చింది లేదు. దానికి తోడు ఆమెను ట్రోల్ చేసే జనాలు కూడా ఎక్కువైపోయారు . ఒకవేళ ఆ స్థానంలో రష్మిక ఉంటే కచ్చితంగా ఇంకా ఎక్కువ స్థాయిలోనే ట్రోలింగ్ జరిగుండేది . దీంతో రష్మిక లక్కీ ఫెలో అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news