Moviesఎవ్వరికి తెలియకుండా ..గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన ప్రభాస్.. ఎందుకో తెలిస్తే...

ఎవ్వరికి తెలియకుండా ..గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన ప్రభాస్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే . సలార్ సినిమా దాదాపు 680 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలన రికార్డును క్రియేట్ చేసింది . ఇలాంటి క్రమంలోనే బాహుబలి తర్వాత ఒక్క హిట్ కోసం వెయిట్ చేసిన ప్రభాస్ కి మంచి సక్సెస్ లభించింది.

దీంతో రెబల్ అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు . సంతోషం వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడం.. సక్సెస్ సెలబ్రేషన్స్ చేయకపోవడం ఫాన్స్ ను డిసప్పాయింట్ చేసింది . అయితే రీసెంట్గా ప్రభాస్ బయటకు వచ్చాడు . సలార్ నిర్మాతలు హోంబులే సంస్థ కర్ణాటక సంస్థ అని తెలిసిందే. సలార్ సినిమా విజయం కావడంతో నిర్మాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరి కొంతమంది మంగుళూరు దగ్గరలో కాటేల్ అనే ఊళ్లో శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు .

అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అధికారులు ప్రభాస్ కి అమ్మవారి పటం ప్రసాదం అందజేశారు. నిజానికి ఇక్కడకి ప్రభాస్ వస్తున్నాడు అని జనాలకి కూడా తెలియదు. గుట్టు చప్పుడు కాకుండా అంతా చేసేశారు. కానీ లాస్ట్ లో ఆయన రాక ను కనిపెట్టేశారు అభిమానులు. దీంతో ప్రభాస్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ కళ్ళజోడు పెట్టుకొని తలపై క్యాప్ పెట్టుకొని మాస్క్ తో చాలా ట్రెండీగా స్టైలిష్ గా ట్రెడిషనల్ గా కనిపించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news