Moviesఅయోధ్యతో కోహ్లీ భార్య అనుష్క శర్మకు విడదీయరా ప్రత్యేక అనుబంధం.. అది...

అయోధ్యతో కోహ్లీ భార్య అనుష్క శర్మకు విడదీయరా ప్రత్యేక అనుబంధం.. అది ఏంటో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . చారిత్రక నగరం అయోధ్య ఆధ్యాత్మికత శోభను సంతరించుకునింది . జనవరి 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక నేపథ్యంలో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది . ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాజకీయ – సినీ – క్రీడా – పారిశ్రామిక ప్రముఖులు చాలామంది హాజరు కాబోతున్నారు .

అందుకే వాళ్ళ సెక్యూరిటీలకు సంబంధించి ప్రతి విషయాన్ని కేర్ఫుల్ గా చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కాగా రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇండియన్ స్టార్ క్రికెటర్ కోహ్లీ కూడా అటెండ్ కాబోతున్నారు . వీళ్ళకి అయోధ్య రామ మందిరం నుంచి ఆహ్వానం కూడా అందింది. అయితే అనుష్కకు అయోధ్యతో ఒక ప్రత్యేక విడదీయరాని అనుబంధం ఉంది .

అనుష్క శర్మ తండ్రి అజయ్ కుమార్ శర్మ మాజీ ఆర్మీ అధికారి . ఆయన ఉద్యోగరీత్యా దేశవ్యాప్తంగా వివిధ ఆర్మీ కేంద్రాలలో పనిచేశారు . అయితే ఆయన అయోధ్యలోని ఇండియన్ ఆర్మీ డోక్రా రిడ్జిమెంట్ లో పనిచేస్తున్నప్పుడే 1988 మే 1న అనుష్క శర్మ అక్కడ సైనిక ఆసుపత్రిలో జన్మించింది. దీంతో ఆమె కుటుంబానికి ఆమెకు అయోధ్యతో తీవ్రమైన ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది . దీని పట్ల అనుష్క ఎంతో సంతోషం వ్యక్తం చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news