News' దివ్య భారతి ' కోసం సినిమా తీసి చేతులు కాల్చుకున్న...

‘ దివ్య భారతి ‘ కోసం సినిమా తీసి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత ఎవరు…?

మంచు మోహన్ బాబు హీరోగా నిర్మాతగా మంచి ఫాంలో ఉన్నప్పుడు తీసిన సినిమా అసెంబ్లీ రౌడీ. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించగా చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించిన పి.వాసు కథ అందించారు. పరుచూరి సోదరులు మాటలు అందించిన ఈ సినిమాకి కెవి మహదేవన్ సంగీతం అందించారు. సొంత నిర్మాణ సంస్థలో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

శ్రీకాళహస్తీలో తీసిన అందమైన వెన్నెలలోనా పాటకే మోహన్ బాబు చాలా ఖర్చు చేశారట. అంతేకాదు, ఈ సినిమాతో వచ్చిన కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అయింది. దాంతో మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు. ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది దివ్య భారతి. ఇందులో ఆమెను చూసి ఇటు సినీ వర్గాలు, అటు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

దాంతో నెక్స్ట్ ఇయర్ ఇదే కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు అనే సినిమాను తీశారు. అయితే, ఇది తమిళ రీమేక్..కథ మీద అంత నమ్మకం లేకపోవడంతో మోహన్ బాబు కాకుండా పి.శ్రీధర్ రెడ్డి నిర్మించారు. జస్ట్ నిర్మాత మాత్రమే మారాడు తప్ప మిగతా యూనిట్ సభ్యులందరూ సేం టు సేం. అయితే, అసెంబ్లీ రౌడీలో దివ్య భారతిని ఎంతగా ఆదరించారో చిట్టెమ్మ మొగుడులో మాత్రం దానికి భిన్నంగా వ్యతిరేకించారు.

చిట్టెమ్మ పాత్రలో దివ్య భారతి బాగా నటించినప్పటికీ ప్రేక్షకులు చూడలేకపోయారు. అప్పట్లో మోహన్ బాబు అండ్ టీం దివ్య భారతి కోసమే చిట్టెమ్మ మొగుడు సినిమాను తీసి నిర్మాతకి నష్టాలు తెచ్చారనే టాక్ కూడా వినిపించింది. ఈ మూవీతో నిర్మాత ఆర్ధికంగా చాలా నష్టపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో ఒక్కో సినిమా చేసిన దివ్య భారతి మోహన్ బాబుతో మాత్రం రెండు సినిమాలు చేసింది. ఒకటి బ్లాక్ బస్టర్ ఇంకోటి భారీ డిజాస్టర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news