Newsస్టార్ డైరెక్ట‌ర్‌తో హీరో ప్ర‌భు కూతురు ఐశ్వ‌ర్య రెండో పెళ్లి.. ఆమె...

స్టార్ డైరెక్ట‌ర్‌తో హీరో ప్ర‌భు కూతురు ఐశ్వ‌ర్య రెండో పెళ్లి.. ఆమె మొద‌టి భ‌ర్త ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో ప్ర‌భు కుమార్తె ఐశ్వ‌ర్య‌, కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ అధిక్ ర‌విచంద్ర‌న్ పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది. అధిక్ ర‌విచంద్ర‌న్ ఇటీవ‌లే విశాల్‌తో మార్క్ ఆంటోనీ సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమా రు. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరారు. ఇక ఈ రోజు చెన్నైలో జ‌రిగిన పెళ్లికి విశాల్‌తో స‌హా ప‌లువురు కోలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రై ఆశీర్వ‌దించారు.

ఇక ప్ర‌భు కుమార్తె ఐశ్వ‌ర్య విష‌యానికి వ‌స్తే ఆమెకు ఇది రెండో పెళ్లి. 2009లో ఆమెకు బంధువు అయిన కునాల్‌తో పెళ్లి జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ జంట అమెరికాలో సెటిల్ అయ్యారు. కొన్నాళ్ల పాటు కాపురం బాగానే జ‌రిగింది. ఆ త‌ర్వాత స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరిద్ద‌రు విడిపోయారు. భ‌ర్త‌కు దూర‌మ‌య్యాక ఐశ్వ‌ర్య తిరిగి చెన్నై వ‌చ్చేసి తండ్రితో పాటే క‌లిసి ఉంటోంది.

అయితే డైరెక్ట‌ర్ అధిక్, ఐశ్వ‌ర్య పాత స్నేహితులు. వీరిమ‌ధ్య పాత స్నేహం కొత్త‌గా చిగురించ‌డంతో వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది. అలా వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. డైరెక్ట‌ర్ అధిక్ ర‌విచంద్ర‌న్ విష‌యానికి వ‌స్తే త్రిష ఇల్ల‌న న‌య‌న‌తార సినిమాతో కోలీవుడ్‌లో ద‌ర్శ‌క ర‌చ‌యిత‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్‌లో ద‌బాంగ్ 3 సినిమాకు కూడా సినీ ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.

తాజాగా మార్క్ ఆంటోనీ సినిమాతో విశాల్‌కు కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చారు. అలాగే కోబ్రా, కే 13, నెర్కొండ పార్వై సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశాడు. ప్ర‌స్తుతం అజిత్‌తో ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news