Newsఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ సెటైరిక‌ల్ మూవీ...!

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోష‌ల్ సెటైరిక‌ల్ మూవీ…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడుగా మెగాఫోన్ పట్టిన రైటర్ వక్కంతం వంశీ. తొలి సినిమా అంచనాలు అందుకోకపోయినా రచయితగా, దర్శకుడుగా వంశీ ముద్ర చూపించింది. కాస్త గ్యాప్ తీసుకుని తాజాగా వంశీ.. నితిన్ హీరోగా తెరకెక్కించిన సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా శ్రీ లీల హీరోయిన్గా నటించగా.. రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అన్నీ అదిరిపోయాయి. పాటలకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా ట్రైలర్ చూసిన వాళ్లు కూడా ఇదో కామన్ మ్యాన్ స్టోరీ అని.. ప్రేక్షకులకు తప్పకుండా హిట్ అవుతుంద‌న్న అంచనాలతో ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ తన టీం మొత్తం ఎక్స్ట్రా ఆర్డినరి మ్యాన్‌ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని.. సినిమా తప్పకుండా అంద‌రికి న‌చ్చుతుంద‌న్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న సినిమా గురించి కూడా వంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సోషల్ సెటైరికల్ కాన్సెప్ట్ గా తెరకెక్కనుందని అన్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌ను మెప్పిస్తుందని.. ఈ సినిమా కథకుడిగా తనకు మరింత మంచి పేరు తెచ్చి పెడుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. వాస్తవంగా సురేందర్ రెడ్డి స్టార్ హీరోలను సరిగా డీల్ చేయరన్న విమర్శలు ఉన్నాయి.

ఎన్టీఆర్ ఊసరవెల్లి, అశోక్ సినిమాలతో రెండుసార్లు ఛాన్స్‌లిస్తే డిజాస్టర్లు తీశాడు. మహేష్ బాబు అతిధి సినిమాతో ఛాన్స్ ఇచ్చినా ఉపయోగించుకోలేదు. అలాగే చిరంజీవి సైరా, అఖిల్ ఏజెంట్ సినిమాలు కూడా డిజాస్టర్లు అయ్యాయి. మరి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే సురేందర్ రెడ్డి పవన్ ఇమేజ్‌ఎంతవరకు ? బ్యాలెన్స్ చేస్తాడన్న సందేహాలు అయితే అందరిలోనూ ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news