News"ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి".. మహేశ్ సాంగ్ పై ఫిలిం ఇండస్ట్రీలో ...

“ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి”.. మహేశ్ సాంగ్ పై ఫిలిం ఇండస్ట్రీలో కొత్త తలనొప్పులు స్టార్ట్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ నెగిటివిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీల విషయంలో అయితే 100కు 200% పైగా ట్రోలింగ్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా గుంటూరు కారం సినిమా నుంచి ” ఓ మై బేబీ సాంగ్” రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ చాలా బాగున్నాయి .

అయితే కొంతమందికి ఈ పాటలోని లిరిక్స్ బాగా నచ్చడం మరి కొంతమందికి ఓవర్ యాక్టింగ్ గా అనిపించడం మరి కొంతమందికి ఛండాలంగా ఉండడం అనిపించాయి . దీంతో కొందరు కావాలని తమన్ మ్యూజిక్ ని తప్పు పడుతూ ట్రోల్ చేశారు . మరి కొందరు ఇలాంటి లిరిక్స్ ఇచ్చారు ఏంటి ..? అంటూ బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు . దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన రామ జోగయ్య శాస్త్రి గారు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు .

“ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది .. హద్దులు మీరు పోతున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు . దీనిపై ఎవరో ఒకరు స్పందించకపోతే కష్టం అంటూ కూసింత ఘాటుగానే వండిపడ్డారు”. అంతేకాదు ఎప్పుడు కూల్ గా ఉండే రామజోగయ్య శాస్త్రి గారు ఇలా ఫుల్ ఫైర్ అయిపోవడం అభిమానులకు సైతం షాకింగ్ గా ఉంది. అయితే మరి కొంత మంది మాత్రం ఉన్నది ఉన్నట్లు చెప్పడం తప్పా..? బాగుంటే బాగుందని చెప్తాం.. బాగోలేకపోతే బాగోలేదు అని చెప్తాం.. దానికి ఇంత ఫైర్ అవ్వడం అవసరమా ..? అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. మొత్తానికి మహేష్ గుంటూరు కారం సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ అయితే వచ్చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news