Newsముర‌ళీ మోహ‌న్‌కి ఇద్ద‌రు మ‌న‌వ‌రాళ్ళు ఉన్నారా... ఈ ట్విస్ట్‌లో కీర‌వాణి కోడ‌లు...

ముర‌ళీ మోహ‌న్‌కి ఇద్ద‌రు మ‌న‌వ‌రాళ్ళు ఉన్నారా… ఈ ట్విస్ట్‌లో కీర‌వాణి కోడ‌లు అయ్యేదెవ‌రంటే.. ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో అంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కొందరు హీరోలతో పాటు, హీరోయిన్లు చిన్నాచితక ఆర్టిస్ట్‌లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నట్టు రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఆస్కార్ అవార్డ్‌ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ.. నటుడు మురళీమోహన్ మనవరాలని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. తన ఇద్దరు మనవరాలు పెళ్లిళ్లు వచ్చే ఏడాది జరుగుతున్నట్టు తెలిపారు. తనకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారని.. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిందని తెలిపారు. కూతురుకు ఓ అమ్మాయి సంతానం అని.. వచ్చేయేడాది ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో ఆమె వివాహం జరుగుతుందని తెలిపారు. అలాగే తన కొడుకుకి కూడా ఒక కూతురు ఉందని.. అందరూ ఊహించినట్టుగానే ఆమె కీరవాణి ఇంటికి కోడలుగా వెళుతుందని తెలిపారు.

అంటే తన కుమార్తె కూతురు పెళ్లి ఫిబ్రవరిలో.. కూతురి కూతురు పెళ్లి వచ్చేయేడాదికి చివరలో జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఇక మురళీమోహన్ ఏకైక కుమారుడు మాగంటి రూపా దంపతులకు ఏకైక కుమార్తె ఉన్నారు. ఆమె పేరు రాగ. కొద్ది రోజుల క్రితమే ఆమె అమెరికాలో బిజినెస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం మాగంటి కుటుంబానికి ఉన్న కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆమె చూసుకుంటుంది.

మొదటినుంచి మురళీమోహన్‌కు ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కీరవాణి అబ్బాయితో తన మనవరాలు రాగని ఇచ్చి వివాహం చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ఇక శ్రీ సింహ విషయానికి వస్తే ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో బాల‌నటుడుగా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news