Newsఇట‌లీ బ‌య‌లు దేరిన వ‌రుణ్ - లావ‌ణ్య క‌ళ్ల‌ల్లో క‌ళ్లుపెట్టి చూస్తూ...

ఇట‌లీ బ‌య‌లు దేరిన వ‌రుణ్ – లావ‌ణ్య క‌ళ్ల‌ల్లో క‌ళ్లుపెట్టి చూస్తూ …

మెగా ఇంట్లో పెళ్లి సందడికీ అంతా సిద్ధమయింది. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన ఇటలీలో మకాం వేశారు. నాగబాబు తనయుడు మెగా హీరో వరుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల‌ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలోని జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. నవంబర్ ఒకటో తేదీన ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి కానున్నారు.

తాజాగా పెళ్లి షాపింగ్ పూర్తిచేసుకుని ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు. కాబోయే భార్యాభర్తలు వరుణ్ తేజ్ – లావణ్య శుక్రవారం ఉదయం డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్న ప్రాంతానికి బయలుదేరారు. ఎయిర్ పోర్టులో వీరిద్ద‌రు ఒక‌రి క‌ళ్ల‌ల్లో ఒక‌రు క‌ళ్లు పెట్టుకుని చాలా హ్యాపీగా ఇటలీ బ‌య‌లు దేరుతోన్న విజువ‌ల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇప్పటికే నిహారిక తో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్లిపోయారు. పెళ్లి తర్వాత రిసెప్షన్ మాత్రం హైదరాబాదులో గ్రాండ్గా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ శుభలేఖ సోష‌ల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాలులో రాత్రి 7 గంటలకు రిసెప్షన్ ప్రారంభమవుతుందని శుభలేఖలో అచ్చు వేయించారు. ఈ ఆహ్వాన పత్రికలో చిరంజీవి – పవన్ కళ్యాణ్ – రామ్ చరణ్ పేర్లు ముద్రించారు.

కాగా వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది నటించిన గాండీవధారి అర్జున సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయింది. ఇక వరుణ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం నటిస్తున్న రెండు వెబ్ సిరీస్ షూటింగ్ లు మధ్యలో ఉన్నాయి. పెళ్లి తర్వాత లావణ్య ఈ రెండు వెబ్ సిరీస్ ల షూటింగులు పూర్తి చేయనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news