Newsభారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో విక్టరీ వెంకటేష్ అల్లరి చూశారా.. నవ్వు...

భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో విక్టరీ వెంకటేష్ అల్లరి చూశారా.. నవ్వు ఆపుకోలేం.. !

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎంతో సరదాగా ఉంటారు. వెంకటేష్ సినిమాలపరంగా ఎంత బిజీగా ఉన్నా క్రికెట్ ప్రేమికుడు కావడంతో భారత జట్టు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా అక్కడ వాలిపోతాడు. భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుంటే అక్కడికి వెళ్లి స్టేడియంలో సాధారణ ప్రేక్ష‌కుడిలా మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేయడంతో పాటు మనవాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.

2011, 2015, 2019 ప్రపంచ కప్‌లు జరిగినప్పుడు వెంకటేష్ భారత జట్టు మ్యాచులు ఎక్కడ జరిగినా.. అక్కడికి వెళ్లి మరి ఎంజాయ్ చేశారు. తాజా ప్రపంచ కప్‌లో భాగంగా గత రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో భారత్ – ఇంగ్లాండ్ జ‌ట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది.. ముందు బ్యాటింగ్ చేసిన మన జట్టు తక్కువ స్కోరు సాధించినా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్ల వికెట్లు వరుస పెట్టి తీయడంతో భారత గెలుపు సులువు అయింది.

అయితే ఐదు వికెట్లు పడ్డాక లివింగ్ స్టోన్, మెమిన్ ఆలీ ఇద్దరూ కలిపి కాసేపు ఇంగ్లండ్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆ టైంలో కాస్త భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. అదే టైంలో స్పిన్నర్ కులదీప్ యాదవ్ మెమిన్ ఆలీని అవుట్ చేశాడు. ఈ టైంలో స్టాండ్స్ లో ఉన్న వెంకటేష్ గంతులు వేస్తూ మెమీన్ ఆలీని పెవిలియ‌న్‌కు రావాలని చేతులు ఊపుతూ కనిపించాడు.

ఇది స్క్రీన్ మీద చాలా క్లియర్‌గా కనిపించడంతో తెలుగు కామెంట్రీలు కూడా వెంకటేష్ చేతులూపుతు బాబు ఇక రా నాయనకు వచ్చెయ్ అంటున్నాడని సరదాగా కామెంట్ చేశారు. ఇది చక్కగా హైలైట్ అయింది. ఆ త‌ర్వాత వెంక‌టేష్ కామెంట‌రీ బాక్సులోకి వ‌చ్చి కాసేపు చక్క‌గా కామెంట‌రీ కూడా చేశాడు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సైంధవ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news