Newsమ‌హేష్ ఎందుకు పూరి ఫోన్ ఎత్త‌డు... మ‌ధ్య‌లో న‌మ్ర‌త వ‌ల్ల కూడా...

మ‌హేష్ ఎందుకు పూరి ఫోన్ ఎత్త‌డు… మ‌ధ్య‌లో న‌మ్ర‌త వ‌ల్ల కూడా గ్యాప్ పెరిగిందా…?

సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఉంటే టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పోకిరి, బిజినెస్మెన్ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. పోకిరి సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ అయ్యి మహేష్ బాబు కెరీర్ ను ఒక్కసారిగా తీసుకువెళ్లి టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. ఆ తర్వాత వీరు కాంబినేషన్లో వచ్చిన బిజినెస్‌మేన్ కూడా సూపర్ హిట్ అయింది.

ఆ తర్వాత వీరుద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావాలని మహేష్ బాబు అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఇదే టైంలో పూరి వరుస ప్లాపుల్లో పడ్డారు. పూరికి స్టార్ హీరోలు ఎవరు కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి టైంలో తన డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన‌ జనగణమన మహేష్ బాబుతో తీయాలని పూరి ఎన్నో కలలు కన్నారు. అయితే మహేష్ దీనిపై ఇంట్రెస్ట్ చూప‌లేదు. పూరి రెండు మూడుసార్లు ఫోన్ చేసినా కూడా మహేష్ ఫోన్ కూడా ఎత్తలేదని అంటారు.

పూరి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనం ప్లాపుల్లో ఉంటే మహేష్ బాబుకు అస్సలు కలవ‌డు అంటూ సెటైర్లు కూడా వేశాడు. అప్పటి నుంచి ఇద్దరు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని అంటారు. ఇదిలా ఉంటే తన తాజా ఇంటర్వ్యూలో మరోసారి పూరి మహేష్ బాబుపై తనకు ఉన్న అసంతృప్తి, అసహనాన్ని బయట పెట్టుకున్నాడు. తన మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అంటే మహేష్ బాబు అభిమానులకు కూడా ఎంతో నమ్మకం ఉందని.. కానీ మహేష్ కు లేదని కుండ బద్దలు కొట్టేశాడు.

పూరి వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు. మహేష్ బాబు తో జనగణమన సినిమా చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నమ్రత శిరోద్కర్ మాత్రం అసలు ఒప్పుకోలేదని అంటారు. అప్పటికే మహేష్ బాబు వరుస హిట్లర్ తో వున్నాడు. ప్లాపుల్లో ఉన్న పూరితో సినిమా చేస్తే మహేష్ మార్కెట్ డౌన్ అవుతుందన్న సందేహంతో నమ్రత కూడా పూరికి అసలు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేదే కాదని.. అలా వీరిద్దరి మధ్య ఉన్న గ్యాప్‌ నమ్రత మరింత పెంచేసింది అన్న పుకార్లు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పట్లో పూరి – మహేష్ మధ్య గ్యాప్ అయితే తగ్గేలా లేదు. ఇక వీరి కాంబినేషన్లో ఇప్పటిలో సినిమా వస్తుందని ఆశించడం కూడా అత్యాశ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news