Moviesపాన్ ఇండియా డైరెక్టర్ తో వైష్ణవి చైతన్య.. జాక్ పాట్ ఆఫర్...

పాన్ ఇండియా డైరెక్టర్ తో వైష్ణవి చైతన్య.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన బేబీ..!!

ఇది నిజంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి . లేకపోతే సెకండ్ సినిమాకి పాన్ ఇండియా డైరెక్టర్ తో ఆఫర్ రావడం అంటే మామూలు విషయం కాదు . ఒకపక్క సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు లేక హీరోయిన్స్ అల్లాడిపోతుంటే .. ఈ బ్యూటీ మాత్రం వరుసగా క్రేజీ ఆఫర్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది . ఇప్పటివరకు ఆమె చేసింది ఒక్కటంటే ఒక్క సినిమానే.. వెబ్ సిరీస్ లు చేసినా కానీ అమ్మడుకు అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే చెప్పాలి .

కానీ బేబీ సినిమాతో మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన వైష్ణవి చైతన్య రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ నుంచి క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది . ఇప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ సినిమాకి కమిట్ అయిన వైష్ణవి చైతన్య త్వరలోనే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న “ఇస్మార్ట్ దబుల్” సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాదు ఇదే విషయాన్ని అన్ అఫిషియల్ గా కన్ఫామ్ చేస్తూ రాం పోతినేని ఆమెకు బేబీ సినిమా హిట్ అయిన సందర్భంగా ఫ్లవర్ బొకేని కూడా పంపించారు . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే వైష్ణవి చైతన్య సెకండ్ సినిమాని పాన్ ఇండియా డైరెక్టర్ తో చేయబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఈ సినిమాల్లో రామ్ పోతినేని తో కలిసి మాస్ అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేయబోతుంది వైష్ణవి చైతన్య అంటూ తెలుస్తుంది.

మొత్తానికి బేబీ సినిమాతో తన పూర్తి తలరాతనే మార్చేసుకుంది వైష్ణవి చైతన్య అంటూ ఫ్యాన్స్ అందరు సంబరపడిపోతున్నారు. చూడాలి సెకండ్ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకోబోతుందో .. ఈ బ్యూటి. అయితే మూడో సినిమాను అల్లు శిరీష్ తో ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది . నిజానికి రెండో సినిమానే శిరీష్ తో చెయ్యాలి..కానీ ఇస్మార్ట్ డబల్ ఆల్రెడీ సెట్స్ పై ఉండడంతో ఈ సినిమాని కంప్లీట్ చేశాక అల్లు శిరీష్ సినిమాతో సెట్స్ లో పాల్గొనబోతోంది వైష్ణవి చైతన్య అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news